శ్రీ సిటిలో ఇసుజు వాహనాల ఉత్పత్తి మొదలు

చిత్తూరు, నెల్లూరు జిల్లాలో వ్యాపించి ఉన్న శ్రీ సిటీ పారిశ్రామిక పట్టణంలో రూ. 3000 కోట్లు పెట్టుబడితో జపాన్ కి చెందిన ఇసుజు మోటార్స్ భారత్ విభాగం డి-మాక్స్ పికప్ వాహనాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దాని మొదటి దశ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇవ్వాళ్ళ నుంచి ఉత్పత్తి కూడా మొదలుపెట్టింది దానిలో తయారయిన మొట్టమొదటి వాహనం ఇవ్వాళ్ళ బయటకి వచ్చింది. మొదటి దశలో ఏడాదికి 50,000 పికప్ వాహనాలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు ఇసుజు మోటార్స్ సంస్థ ప్రెసిడెంట్ మసనోరి కటయామ తెలిపారు. రెండవ దశ నిర్మాణం పూర్తయితే ఏడాదికి 1,20,000 వాహనాలను ఉత్పత్తి చేస్తామని తెలిపారు. భారత్ మార్కెట్ పై సుమారు నాలుగేళ్లపాటు సర్వే చేసిన తరువాతఇక్కడ మంచి వ్యాపారావకాశాలున్నట్లు గుర్తించి ఈ ప్లాంట్ నెలకొల్పామని అయన చెప్పారు. ఈ ప్లాంట్ లో ఉత్పత్తి అయిన వాహనాలను కేవలం భారత్ లోనే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్ లో 70శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని చెప్పారు. ఈ వాహనాల తయారీ కోసం అవసరమయిన కొన్ని విడిభాగాలను తయారు చేసేందుకు 120 సంస్థలతో ఒప్పందాలు చేసుకొన్నామని, వాటిలో చాలా సంస్థలు ఈ ప్రాంతంలోనే తమ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పబోతున్నాయని, వాటి ద్వారా కూడా వందలాది మంది స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు.

శ్రీ సిటీలోనే సుమారు రూ. 1500 కోట్లు పెట్టుబడితో నెలకొల్పబడుతున్న మొండలీజ్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా రెండు రోజుల క్రితమే తన మొదటి దశ ఉత్పత్తి కార్యక్రమాలను ప్రారంభించింది. దానిలో ఏడాదికి 60,000 టన్నుల క్యాడ్ బరీస్ చాక్లెట్లు ఉత్పత్తి అవుతాయి. మొత్తం మూడు దశలలో నిర్మితమవుతున్న ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలుపెడితే ఏడాదికి 2.5 లక్షల టన్నుల మిల్క్ చాక్లెట్స్, బిస్కట్లు తయారవుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close