మంచు విష్ణు సినిమా కన్నప్ప యూనిట్ పై ఐటీ,జీఎస్టీ దాడులు జరుగుతున్నాయి. కన్నప్ప సినిమా ఫైనల్ ప్రింట్ చూసేందుకు విష్ణు ప్రసాద్ ల్యాబ్స్ కు వెళ్లిన సమయంలో ఈ దాడులు ప్రారంభమయ్యాయి. కన్నప్ప సినిమా ప్లస్ పాయింట్లలో మంచు విష్ణు మొదటిగా బడ్జెట్ గురించి చెబుతూ వస్తున్నారు. నేరుగా ఎంత అయిందో చెప్పలేదు కానీ ఆఫ్ ది రికార్డు రెండు వందల కోట్లు అని మీడియా ప్రతినిధులకు చెప్పడంతో అదే విస్తృతంగా ప్రచారం అయింది.ఆ నోటా ఈ నోటా పడి ఐటీ, జీఎస్టీ అధఇకారుల వద్దకూ చేరింది.
దానికి తగ్గట్లుగా పన్నులు కట్టలేదని అనుకున్న అధికారులు దాడులు చేశారు. రసీదులు చూస్తున్నారు. ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఏం తేలిందన్నది బయటకు రాదు. అధికారికంగా ప్రకటించరు. ఏమైనా తేడాలు ఉంటే.. జరిమానా వేస్తూ నోటీసులు ఇస్తారు. అదంతా బయటకు రాకుండా జరిగిపోతుంది. అయితే పత్రాల్లో నిజంగా కన్నప్పకు ఎంత బడ్జెట్ అయిందన్నది ఐటీ, జీఎస్టీ అధికారులుక తెలిసిపోతుంది.సినిమా ప్రపంచంలో సహజంగా..బయట జరిగే ప్రచారానికి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది.
కన్నప్ప సినిమాపై విష్ణు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. అన్ని భాషల సూపర్ స్టార్లు ఉన్నందున రిలీజ్ రోజున వంద కోట్లు అంచనా వేస్తున్నామని విష్ణు చెబుతున్నారు. సినిమా రిలీజ్ అయి ఆ మాత్రం కలెషన్లు వచ్చి ఐటీ , జీఎస్టీ దాడులు జరిగి ఉంటే.. ఆయన కూడా కాస్త హ్యాపీ ఫీలయ్యేవారు ఏమో కానీ ఇప్పుడు మాత్రం టెన్షన్ కు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓ వైపు సినిమా రిలీజ్ ..మరో వైపు .. ట్యాక్ రెయిడ్స్. ఇదంతా శివుడు పెడుతున్న పరీక్షే అని విష్ణు అనుకోవాలి.