17న జగన్, చంద్రబాబు ముఖాముఖి భేటీ ..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత ఓ సమావేశంలో ఉండటం సాధ్యమేనా..? అసెంబ్లీ సమావేశాలు కాకుండా.. . నేరుగా ఎదురెదురుగా కూర్చునే మీటింగ్ వారి మధ్య ఊహించగలమా..? మొదటి సారి అలాంటి సమావేశం పదిహేడో తేదీన జరగబోతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్, సభ్యుల ఎంపిక కోసం అత్యున్నత కమిటీ సమావేశం కాబోతోంది. నిబంధనల ప్రకారం.. ఈ కమిటికీ ముఖ్యమంత్రి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, అసెంబ్లీ, శాసన మండలిల్లో ప్రతిపక్ష నేతలతో పాటు హోంమంత్రి సభ్యులుగా ఉంటారు.

అంటే సీఎం జగన్‌తో పాటు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు, హోంమంత్రిగా సుచరిత , అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని, మండలి చైర్మన్‌గా షరీఫ్, మండలిలో ప్రతిపక్ష నేతగా యనమల కూడా సభ్యులుగా ఉంటారు. అంటే మొత్తం ఆరుగురితో ఉన్న అత్యున్నత కమిటీలో ముగ్గురు వైసీపీకి చెందిన వారు.. ముగ్గురు టీడీపీ నేతలు ఉన్నారు. అందుకే ఈ కమిటీ సమావేశం ఆసక్తికరంగా మారింది. మానవహక్కుల కమిటీని ఏర్పాటు చేయకపోతే.. న్యాయస్థానాల నుంచి చీవాట్లు ఎదురవుతాయి. ఒక వేళ ఏర్పాటు చేయాలంటే.. ఖచ్చితంగా కమిటీ సమావేశం నిర్వహించి… కమిటీని ఎంపిక చేయాల్సి ఉంది. అందుకే సీఎం జగన్ చంద్రబాబుతో పాటు షరీఫ్, యనుమలతో సమావేశానికి అంగీకిరంచినట్లుగా తెలుస్తోంది.

అయితే.. ఇప్పటికైతే అధికారికంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజుకు జరుగుతుందా లేకపోతే వాయిదా పడుతుందా… ఒక వేళ జరిగితే.. ప్రతిపక్ష నేతలు హాజరవుతారా.. అన్నది సస్పెన్సే. హాజరయితే మాత్రం… మానవహక్కుల కమిటీ విషయంలో.., ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రాబబుల్స్ విషయంలో విపక్షాల నుంచి వ్యతిరేకత వస్తుంది. దీంతో కమిటీ నియామకం పెండింగ్‌లో పడే అవకాశం ఉంది. అందుకే.. ఈ మీటింగ్ కాస్త ఆసక్తి రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close