జగన్ ప్రచారం క్యాన్సిల్..! ప్రజల కోసమే..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు. పధ్నాలుగో తేదీన ఆయన తిరుపతిలో పర్యటించాలనుకున్నారు. ఓ రోజు మొత్తం తిరుపతి లోక్‌సభ ఎన్నికల కోసం ప్రచారం చేయాలనుకున్నారు. కానీ హఠాత్తుగా ఆయన మళ్లీ క్యాన్సిల్ చేసుకున్నారు. నెల్లూరు, తిరుపతిల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందున ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతోనే తిరుపతి పర్యటన రద్దు చేసుకుంటున్నట్లుగా ఆయన లేఖ కూడా విడుదల చేశారు. అంటే ప్రజల కోసమే జగన్ తిరుపతి పర్యటన వాయిదావేసుకున్నారన్నమాట. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ల తర్వాత ఆయన బయటకు వస్తున్నారని ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ అయింది.

అయితే సీఎం చెప్పినట్లుగా కరోనానే కారణమా అంటే… వైసీపీ నేతల ప్రచారాలను .. మరి అదేంటి అనిచూపిస్తున్నారు ఇతర పార్టీల నేతలు. తిరుపతిలో ప్రతి నియోజకవర్గంలోనూ .. బాధ్యులైన మంత్రులు.. ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తారు. గ్రామాల వారీగా బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. ఆ మాటకొస్తే ఒక్క వైసీపీ మాత్రమే కాదు.. అన్ని పార్టీల నేతలు తిరుపతిలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. మాస్కులు కూడా పెట్టుకోకుండా డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కానీ సీఎం జగన్ తన పార్టీ వారికి ఎలాంటి సందేశాలు ఇవ్వకుండానే.. తాను కరోనా కారణంగానే ప్రచారాన్ని విరమించుకుంటున్నానని ప్రకటించారు.

జగన్మోహన్ రెడ్డి మొదట ప్రచారానికి వస్తారని ప్రకటించినప్పుడు… ఇతర పార్టీల నేతలు… పరిస్థితి బాగో లేదు కాబట్టే…ప్రచారానికి వస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు.. ఆగిపోయారు కాబట్టి.. ఆశలు వదిలేసుకున్నారు కాబట్టే.. అని ప్రచారం చేస్తారేమో చూడాలి. జగన్ తిరుపతికి వెళ్లకపోవడం వల్ల తిరుమల టూర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. పదిహేనో తేదీన ఆయన తిరుమలలో పర్యటించి కొత్తగా నిర్మించిన బూందీపోటును ప్రారంభించాల్సి ఉంది. కానీ అది కూడా వాయిదా పడినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close