జగన్‌కు తెలుగు మీడియంలోనూ “ఆ సామాజికవర్గమే” కనిపించింది..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక్క సామాజికవర్గమే కనిపిస్తోంది. ప్రతీ విషయాన్ని ఆయన సామాజికవర్గంతోనే ముడి పెట్టుకుంటున్నారు. ఆ ఒక్క సామాజికవర్గం అంటూ.. పదే పదే కలవరిస్తున్నారు. ఈ విషయం అసెంబ్లీ వేదికగా మరోసారి బయట పడింది. ఇంగ్లిష్ మీడియంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో.. ఆయన … కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. తెలుగు మీడియంను పూర్తిగా రద్దు చేసి.. ఇంగ్లిష్ మీడియంను.. తీసుకురావాలన్న నిర్ణయాన్ని మీడియా సంస్థలు వ్యతిరేకించాయని.. ప్రత్యేక కథనాలు రాశాయని… కథనాల ప్రింట్లు తీసుకొచ్చి మరీ.. జగన్ అసెంబ్లీలో చదివి వినిపించారు.

తెలుగు మీడియం రద్దు విషయంలో ఆ కథనాలన్నింటినీ ఓ సామాజికవర్గం దాడిగా చెప్పుకోవచ్చని జగన్ నిర్మోహమాటంగా ప్రకటించారు.
ఇంగ్లిష్ మీడియం అనగానే ఓ సామాజికవర్గం దాడి మొదలు పెట్టిందని విమర్శించారు. తన విమర్శల్లో మరోసారి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరును ప్రస్తావించారు. మీ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవడం లేదా అంటూ ప్రశ్నించారు. ఇంగ్లిష్ మీడియం ను ఎవరూ వ్యతిరేకించలేదు. తెలుగు మీడియం రద్దును మాత్రమే అందరూ ప్రశ్నించారు.

కానీ జగన్మోహన్ రెడ్డి తన మానాన తాను రాజకీయం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలుగు భాషకు కూడా… సామాజికవర్గం అంట గట్టేశారు. తెలుగు భాష కోసం.. ఒక్క సామాజికవర్గమే తాపత్రయ పడుతోందన్నట్లుగా మాట్లాడారు. ఎన్నికల ముందు నుంచీ.. ఓ సామాజికవర్గం.. ఓ సామాజికవర్గం అంటూ… రెచ్చగొట్టే రాజకీయాలు చేసిన జగన్… ఇప్పుడు.. తన నిర్ణయాలపై వచ్చే వ్యతిరేకతను కూడా ఆ సామాజికవర్గానికే అంట గడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close