ఎన్డీఏలోకి వస్తా – మోదీ ముందు జగన్ ప్రతిపాదన ?

టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరకుండా ఉండేందుకు జగన్ రెడ్డి ఆఖరి రాగం పాడేశారని జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ప్రధానమంత్రితో జరిగిన భేటీలో ఆయన .. తాను నమ్మకమైన మిత్రుడినని కోరుకుంటే.. వెంటనే ఎన్డీఏలో చేరిపోతానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రధాని మోదీ అంశంపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయనట్లుగా చెబుతున్నారు. పార్లమెంట్ లో ప్రధాని మోదీ చాలా బిజీగా ఉన్నారు. అందుకే జగన్ రెడ్డితో పది నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఎక్కువ సమయం వెయిటింగ్ కే సరిపోయింది.

ఎన్డీఏలో చేరికపై జగన్ రెడ్డి చేసిన ప్రతిపాదనపై బీజేపీకి ఏ మాత్రం ఆసక్తి ఉన్నా… తదుపరి అమిత్ షాతో చర్చలు నిర్వహించి ఉండేవారని అనుకుంటున్నారు. అయితే అమిత్ షా జగన్ రెడ్డిని కలవలేదు. ఆయన పార్లమెంట్ లోనే ఉన్నప్పటికీ సమయం ఇచ్చేందుకు అంగీకరించలేదు. అంటే ఈ ప్రతిపాదనపై బీజేపీ సుముఖంగా లేదని చెబుున్నారు. జగన్ రెడ్డి చివరి అస్త్రంగా ఎన్డీఏలో చేరికపై ఆఫర్ ఇచ్చినా బీజేపీ స్పందించకపోవడం వైసీపీ వర్గాలకు షాక్ కు గురి చేసింది. లోక్ సభ సీట్లు ఎన్ని వచ్చినా రాకపోయినా.. రాజ్యసభలో తమకు పన్నెండు మంది సభ్యుల బలం ఉంటుందని దాన్ని చూసైనా … బీజేపీ ఫ్రెండ్లీగా ఉంటుందని అనుకుంటున్నామని వైసీపీ నేతలనుకున్నారు.

ఏపీలో పరిస్థితులపై బీజేపీ హైకమాండ్ కు స్పష్టమైన అవగాహన ఉందని చెబుతున్నారు. జగన్ రెడ్డి సహకరించిన దానికి ప్రతిఫలంగా తాము కూడా చాలా వరకూ సహకరించామని.. ప్రతీ నిర్వాకంలోనూ భాగం పంచుకోలేమన్నట్లుగా బీజేపీ నేతల తీరు ఉందని అంటున్నారు . జగన్ రెడ్డి ఎన్డీఏలో చేరడం వల్ల మైనస్సే కానీ.. ప్లస్ ఉండదని అంచనాకు వచ్చి ఆయన ప్రతిపాదనను పట్టించుకోవట్లేదని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close