ఆ రిటైర్డ్ ఐఏఎస్ విధేయత టిక్కెట్‌ ఇవ్వడానికి సరిపోలేదా !?

జగన్ రెడ్డి సీఎం అవగానే ఆయనకు తనంత విధేయుడు.. ఆత్మీయుడు ఎవరూ ఉండరన్నట్లుగా వ్యవహరించారు ఐఏఎస్ ఆధికారి ఎస్ఆర్‌కేఆర్ విజయ్ కుమార్. ఆయన ఉత్సాహాన్ని జగన్ రెడ్డి సంపూర్ణంగా వాడుకున్నారు. అమరావతి నిర్ణయాల్లో చేసిన తప్పుడు వ్యవహారాలన్నింటికీ ఆయననే ముందు పెట్టారు. తప్పుడు నివేదికలను వివిధ సంస్థలతో ఇప్పించడంలో ఆయనదే కీలక పాత్ర. ఇందుకు ప్రతిఫలంగా టిక్కెట్లు ఆఫర్ చేశారేమో కానీ.. ప్రతి సమావేశంలో జగన్ రెడ్డిపై పొగడ్తలు.. టీడీపీ నేతలపై విమర్శలు చేసేవారు.

అయితే ఆయన ఇప్పుడు రోడ్డున పడ్డారు. టిక్కెట్ల కేటాయింపులో ఆయన పేరు అసలు పరిగణలోకి తీసుకోవడం లేదు. పాదయాత్ర చేయాలని వైసీపీ పెద్దలు సూచిస్తే అదీ చేశారు. కానీ పట్టించుకోవడం దీంతో ఆయన కూడా తాను మోసపోయానని అనుకున్నారేమో కానీ జగన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులు అన్యాయానికి గురయ్యారని మాట్లాడటం ప్రారంభించారు. కామెడీ ఏమిటంటే ఆయన అంతకు ముందు కూలీ మీడియా అటెన్షన్ పొందేవారు. ఈ సారి వారు ఆయనను పట్టించుకోవడం లేదు. నాగార్జున యూనివర్శిటి ముందు దళితలతో సభ నిర్వహించినా పట్టించుకోవడం లేదు.

దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని జగన్ రెడ్డి వాడుకున్నట్లుగా ఎవరూ వాడుకోలేదు. వారిని ముందు పెట్టి తన రాజకీయ లక్ష్యాన్ని అందుకుంటున్నారు. చివరికి వారంతా బలి పశువులు అయ్యే పరిస్థితి వస్తోంది. రిటైర్ అయినా… ప్రభుత్వం మారితే.. వారి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన.. వారిలో ఇప్పటికే ప్రారంభమై ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close