ఏజీతో ఢిల్లీకి జగన్..! అమిత్‌షాతో గంట భేటీ..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. హోంమంత్రి అమిత్ షాతో దాదాపుగా యాభై నిమిషాల సేపు జగన్ సమావేశమయ్యారు. సమావేశంలో పీఎంవో కీలక అధికారి మిశ్రా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తన ఎజెండా ప్రకారం అమరావతి భూములు, ఫైబర్ నెట్ వంటి వాటిపై సీబీఐ విచారణలు కోరినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైనా వినతి పత్రం సమర్పించారు.

వాస్తవానికి నిన్న ఉదయం వరకూ ఢిల్లీ పర్యటన అనే ఆలోచనే లేని.. ముఖ్యమంత్రి సాయంత్రానికి షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. దీంతో ఏదో అర్జంట్ మ్యాటర్ ఉందని అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే జగన్‌ తన పాటు న్యాయనిపుణులను ఢిల్లీ తీసుకెళ్లారు. జగన్ తో పాటు ఢిల్లీ వెళ్లిన వారిలో అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యంశ్రీరాంతో పాటు సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు భూషణ్ కూడా ఉన్నారు. భూషణ్ కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూంటారు. ఇప్పుడు.. జగన్ కోసం ఆయన కుమారుడు పని చేస్తున్నారు.

అమిత్ షాతో భేటీ సమయంలో… ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం ఆరు గంటలకు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారయినప్పటికీ… ఎనిమిది తర్వాతే భేటీ అయ్యే అవకాశం దొరికింది. దాంతో ఇతర కేంద్రమంత్రుల్ని కలవలేకపోయారు. బుధవారం మధ్యాహ్నం వరకు వివిధ కేంద్రమంత్రుల్ని కలిసి..మధ్యాహ్నం తర్వాత నేరుగా తిరుపతికి వెళ్లే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close