బీజేపీకి రాజ్యసభ సీటు ఆఫర్ ఇస్తున్న జగన్ రెడ్డి !

రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. వైసీపీ మూడు సీట్లు గెలవగలదు. కానీ ఎమ్మెల్యేలందరూ ఓట్లు వేస్తేనే కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి బాగోలేదు. 70 మంది ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు. నాలుగు జాబితాల్లో ప్రకటించిన.. బదిలీ చేసిన.. టిక్కెట్ నిరాకరించిన వారు ఓటు వేస్తారన్న నమ్మకం లేదు. దళిత ఎమ్మెల్యేలను ఎక్కువగా బలి చేయడంతో వారు గుర్రుగా ఉన్నారు. నిజానికి మరో వంద నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై కసరత్తు జరుగుతోంది. అధికారిక ప్రకటన ఆపేశారు. రాజ్యసభ ఎన్నికల వ్యవహారం తేలిన తర్వాత మిగతా ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

ఇక్కడే జగన్ రెడ్డి అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. మూడో ఓడిపోయే సీటు బీజేపీకి ఇచ్చేందుకు ప్రతిపాదించబోతున్నారు. ఈ ఆఫర్ ను స్వయంగా ఇచ్చేందుకు జగన్ రెడ్డి బీజేపీ పెద్దల వద్దకు వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయనకు అపాయింట్ మెంట్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఖరారు కాగానే జగన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారు. అక్కడ బీజేపీ నేతలతో చర్చలు జరిపి వారికి కావాల్సిన వ్యక్తిని రాజ్యసభకు పంపిస్తామని బేరమాడతారని అంటున్నారు.

జగన్ రెడ్డి బీజేపీతో సన్నిహిత సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు వచ్చి ఎన్ని విమర్శలు చేసినా వారిని ఏమీ అనరు. కానీ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారిని మాత్రం విమర్శిస్తూంటారు. ఇటీవల తన సభ వద్ద బీజేపీ నేతల కటౌట్ కూడా పెట్టింటి పార్టీ నేతలతో తన్నించారు. అయితే ఆ కటౌట్ కు ఎవరి పోలికలు లేకుండా జాగ్రత్తపడ్డారు. కానీ కమలం గుర్తు వేశారు. ముందొక వ్యవహారం.. వెనుకొక వ్యవహారం జగన్ రెడ్డి నడుపుతున్నారని ఈ అంశంపై బీజేపీ నేతలు ఇప్పటికే గుర్రుగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close