అమరావతి ప్రాజెక్టుల పూర్తికి జగన్ ఆదేశం..!

అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలన్నింటినీ పూర్తి చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఆర్డీఏ స్థానంలో తీసుకు వచ్చిన అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ.. పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ పైనా సవివర నివేదిక సమర్పించింది. ముఖ్యంగా కరకట్ట రోడ్డును నాలుగు లైన్ల రహదారిపై విస్తరించాలని జగన్ ఆదేశించారు.

ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా రూపొందించారు. కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరణకు సంబంధించి రోడ్డు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారుతుందని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును మెయిన్‌ రోడ్డుకు అనుసంధానం చేసే పనులు కూడా పూర్తి చేయాలని సీఎం సూచించారు. అదే విధంగా హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాలన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత అమరావతిలో పనులన్నీ ఆగిపోయాయి. ఒకటి రెండు సార్లు.. సమీక్షలు చేసి.. పనులు ప్రారంభించాలని ఆదేశించినట్లుగా మీడియా ప్రకటనలు వచ్చాయి కానీ.. ఇంత వరకూ ప్రకటించలేదు. అయితే ఇప్పుడు కూడా… ఒక్క అమరావతిపైనే కాదు.. విశాఖ ప్రాజెక్టులపైనా సమీక్షించారు.

విశాఖలో గతంలో లూలుకు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడా స్థలాన్ని అభివృద్ధి చేసి అమ్మితేఎంత వస్తాయో లెక్కలు తేల్చారు. 13.59 ఎకరాల స్థలంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌బీసీసీ, ఏపీఐఐసీ కమర్షియల్‌ ప్లాజా, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించవచ్చని కనీసం ప్రభుత్వానికి సుమారు రూ.1450 కోట్ల నికర ఆదాయం వస్తుందని నివేదిక అందించాయి. అయితే.. కొద్ది రోజులుగా దాదాపుగా 1100 కోట్లతో సీఎం క్యాంపాఫీస్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై కూడా చర్చించి ఉంటారని.. కానీ వివరాలు మాత్రం చెప్పలేదని… ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close