నిధులు సమీకరించుకుని అమరావతి భవనాలను కట్టేయాలని అధికారులకు జగన్ ఆదేశం..!

అమరావతి భవనాల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష జరిపారు. ఆ కట్టడాలు పూర్తి చేయడానికి అవసరమైన నిధుల సమీకరణ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అమరావతి మెట్రోపాలిటిన్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీకి సంబంధించిన అధికారులతో జరిపిన సమావేశంలో…అమరావతిలో నిర్మాణాలు ఏయే దశల్లో ఉన్నాయో జగన్ తెలుసుకున్నారు. నిర్మాణాలు పూర్తి చేసే కార్యాచరణపై అధికారులతో చర్చించారు. నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికశాఖ అధికారులతో కలిసి కూర్చుని ప్లాన్‌ చేసుకోవాలన్నారు. హ్యాపీనెస్ట్‌ బిల్డింగ్‌లను కూడా పూర్తి చేయాలన్నారు.

సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతిలో జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేశారు. పధ్నాలుగు నెలల నుంచి అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదు. మధ్య మధ్యలో సమీక్షలు చేస్తున్నట్లుగా మీడియా ప్రకటనలు .. భవనాల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు ఇచ్చినట్లుగా ప్రెస్‌నోట్లు వస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు బొత్స సత్యనారాయణ అమరావతిలో ఉన్న భవనాలను చూసి వస్తూంటారు. కానీ ఇంత వరకూ ఒక్కటంటే ఒక్క అడుగు ముందుకు పడలేదు. కానీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరిలించే ఏర్పాట్లు మాత్రం చేసుకున్నారు.

హ్యాపినెస్ట్ ప్రాజెక్ట్ ను సీఆర్డీఏ చేపట్టింది. అది అమరావతిలో ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకునేవారి కోసం..సీఆర్డీఏ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్. బుకింగ్స్ ప్రారంభించిన గంటల్లోనే ప్లాట్లన్నీ బుక్కయిపోయాయి. పునాదులు వేయక ముందే..ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు అక్కడ రాజధాని లేకపోవడంతో.. ఫ్లాట్లను బుక్ చేసుకున్న వారు తమ డబ్బులు తాము వెనక్కి ఇచ్చేయాలని అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కట్టిస్తామని అంటోంది. ఇప్పటికే టెండర్లను కూడా రద్దు చేసేసింది. మరోసారి రివర్స్ టెండర్లకు వెళ్లింది. ఏ కాంట్రాక్టరూ ముందుకు వచ్చినట్లుగా లేదు. దాంతో పనులు ప్రారంభం కాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close