సీమ బలిజల్ని వాడేసి పక్కన పడేసిన జగన్ రెడ్డి !

జగన్ రెడ్డి వాడకం ఎలా ఉంటుందంటే.. పీల్చి పిప్పి చేసి ఇక పనికి రారు.. అవసరం లేదనుకునే వరకూ వాడతారు. తర్వాత నెత్తికి ఎక్కించుకుంటున్నామని చెప్పి పక్కన పెడతారు. తర్వాత ఎక్కడకు తొక్కేస్తారో అర్థం కాదు. రాయలసీమలో బలిజ నేతల పరిస్థితి ఇదే.

గత ఎన్నికల్లో బలిజల్ని టీడీపీ ప్రభుత్వంపై రెచ్చగొట్టగలిగారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వెణుగోపాల్, చిత్తూరు ఎమ్మెల్యే అరణీ శ్రీనివాసులుకు టిక్కెట్లు కేటాయించారు. కానీ ఈ సారి వారిద్దరీ మొండిచేయి చూపించి రెడ్లకు టిక్కెట్లు ఇచ్చారు. రాయలసీమతో పాటు బలిజ ఓట్లు ఉంటే నెల్లూరు ప్రకాశంలోని మొత్తం 74 నియోజకవర్గాల్లో ఎక్కడా బలిజ వర్గానికి చెందిన నేత పేరు వినిపించడం లేదు. నిజానికి రాజంపేట ఎంపీ టిక్కెట్ బలిజలకే కేటాయిస్తూ ఉంటారు. కానీ వైసీపీ రెడ్డి వర్గానికి చెందిన మిథున్ రెడ్డికి కేటాయిస్తోంది.

గ్రేటర్ రాయలసీమలో బలిజ ఓటర్లు గణనీయంగా ఉంటారు. గత ఎన్నికల్లో ఆ వర్గం వైసీపీకి మద్దతుగా నిలిచింది. జనసేన బరిలో ఉన్నప్పటికీ వారు జగన్ వెంటే నిలిచారు. ఈసారి టికెట్ల విషయంలో ఆ సామాజిక వర్గానికి అధికారపక్షం మొండిచేయి చూపించడంతో ఆ వర్గం ఆలోచనలో పడింది. ఇప్పటికే ఆ వర్గానికి చెందిన కుల సంఘాల నేతలు.. తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బలిజలపై వైసీపీ వివక్ష చూపిస్తోందన్న ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్తున్నారు. ఆ వర్గానికి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కానీ వారి ఓట్లు మాకవసరం లేదన్నట్లుగా వైసీపీ పెద్దల తీరు ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close