పెంచుకుంటూ పోయే ప్రక్రియలో ఈ సారి ఆస్తి పన్ను..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులు పెంచుకుటూ పోతోంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ.. అవకాశం లేకపోయినా స్పేస్ చూసుకుని మరీ పెంచుకుటూ పోతోంది. పెట్రోలో నుంచి టోల్ చార్జీల వరకూ కొత్త కొత్త ఆలోచనలు చేసిన ఏపీ సర్కార్.. ఈ సారి ఆస్తుల మీద కన్నేసింది. ఆస్తి పన్నును అలాగే ఉంచడం కాదు.. వాటి విలువతో పాటు పెంచుకుంటూ పోవాలని నిర్ణయించింది. ఈ మరేకు ఆస్తిపన్ను చట్టానికి సవరణ చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం 2021-22 ఆర్ధిక సంవత్సరం నుంచి ఆస్తి పన్నును రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఏడాది అద్దె విలువ ప్రాతిపదికన ఆస్తి పన్ను లెక్కింపు జరుగుతోంది.

మార్చిన విధానం ప్రకారం రిజిస్ట్రేషన్ విలువలను సవరించిన ప్రతి సారీ ఆస్తి పన్ను పెరుగుతుంది. పెంపు దల కూడా భారీగా ఉండనుంది. ఇప్పటి వరకూ రెండు వేల వరకూ పన్ను కట్టే వాళ్లు.,. ఇక ముందు వివిధ అంచనాలు వేసిన తర్వాత కనీసం పది వేల వరకూ కట్టాల్సిన రావొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే పన్నుల మదింపులోనూ.. చాలా నిబంధనలు ఉన్నాయి. ఈ పన్నుల పెంపు ద్వారా.. కనీసం .. రెండు, మూడు వందల కోట్లు అయినా అదనపు ఆదాయాన్ని ప్రజల వద్ద నుంచి పిండుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే రోడ్ల కోసం అంటూ పెట్రోల్ పై సర్ చార్జీ వేశారు. టోల్ చార్జీలు వసూలుకు నిర్ణయం ప్రకటించారు. రేపోమాపో అమలు చేయడం ప్రారంభించనున్నారు. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత.. దాదాపుగా.. ప్రతీ అంశంలోనూ పన్నులు పెంచారు. ్వన్నీ.. నేరుగా సామాన్యుడి రోజు వారీ జీవన ప్రమాణాలపై ప్రభావం చూపేలాంటివే. ప్రజా వ్యతిరేకత వస్తుందనే ఆలోచనను ప్రభుత్వం అసలు పెట్టుకోవడం లేదు. ప్రస్తుతం గడవాలంటే… తప్పదన్నట్లుగా పన్నులు పెంచుకుంటూ పోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close