మాగుంటపై జగన్ రెడ్డికి అంత ద్వేషం ఎందుకు!?

వైసీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిపై జగన్ రెడ్డి అంత ద్వేషం ఎందుకు పెచుకున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. ఇదే మాగుంటను గత ఎన్నికలకు ముందు బతిమాలి మరీ వైసీపీలోకి తెచ్చుకున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని కాదని మాగుంటకు టిక్కెట్ ఇచ్చారు. ఎందుకంటే మాగుంట వల్ల ప్రకాశం జిల్లాలోనే కాదు నెల్లూరులోనూ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు అదే నేతను పట్టుబట్టి మెడపట్టి బయటకు గెంటేస్తున్నారు.

మాగుంట వల్ల ఎంతో మేలు ఉంటుందనే తాను పట్టుబడుతున్నానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. ఎవరూ పట్టించుకోకపోతే తనకెందకంటున్నారు. నిజానికి మంత్రిగా ఉన్న సమయంలో బాలినేనికి, మాగుంటకు సరిపడేది కాదు. కానీ ఇప్పుడు ఆయననే గట్టిగా సమర్థిస్తున్నారు బాలినేని. మాగుంటను కాదని తిరుపతి నుంచి చెవిరెడ్డిని తెచ్చి టిక్కెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్నదానిపైనా స్పష్టత లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట తండ్రీ కొడుకుల పేర్లు ఉన్నాయి. కానీ తండ్రీని అరెస్టు చేయలేదు. కుమారుడ్ని అరెస్టు చేశారు. ఆయన చాలా కాలం జైల్లో ఉండి అప్రూవర్ గా మారి పూర్తి స్థాయి బెయిల్ తెచ్చుకున్నారు ఈ వ్యవహారంలో సాయిరెడ్డి అల్లుడి సోదరుడిదే కీలక పాత్ర. ఈ కేసు కారణంగా ఆయనపై వ్యతిరేకత పెంచుకోరు.

మరి ఎందుకు మాగుంటను వద్దనుకుంటున్నారో వైసీపీ వర్గాలకు అర్థం కావడం లేదు. పంజాబ్ ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆమ్ ఆద్మీ పార్టీకి ఆర్థిక సాయం అందించారని చెబుతున్నారు. ఈ ఆర్థిక సాయాన్ని జగన్ రెడ్డి చెప్పడం వల్లనే మాగుంట ఇచ్చారని బీజేపీ అనుమానిస్తోంది. ఇప్పుడు మాగుంటకు టిక్కెట్ ఇస్తే.. అదే నిజమనుని బీజేపీ తనపై కక్ష సాధింపులకు పాల్పడుతుందన్న భయంతోనే మాగుంటను పక్కన పెట్టాలని అనుకుంటున్నారని వైసీపీ వర్గాలు ఓ నిర్దారణకు వస్తున్నాయ. మాగుంటకు సీటివ్వకపోతే బాలినేని కూడా దూరమవుతాడని తెలిసినా సరే బీజేపీ భయంతోనే మాగుంటను దూరం పెడుతున్నారని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close