కేంద్రానికి ఓ మాట చెప్పారు..! ఇక జగన్ పని ప్రారంభిస్తారా..?

ఏ క్షణమైనా మూడు రాజధానులపై ఆర్డినెన్స్ తెస్తాం..! సంబంధిత శాఖ అధికారులందరూ అందుబాటులో ఉండాలని.. ప్రభుత్వ పెద్దలు..శుక్రవారం… సంబంధిత విభాగాలకు సమాచారం ఇచ్చారు. అయితే.. శని, ఆదివారం ప్రభుత్వ పెద్దలు ఎలాంటి చప్పుడు చేయలేదు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని జగన్ అనుకోలేదు. కానీ.. కేంద్రానికి అన్నీ చెప్పే చేస్తున్నామన్న తమ మాటలకు ఓ జస్టిఫికేషన్ తెచ్చుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు రాజధానుల విషయంలో.. ఎలాంటి వ్యతిరేక సంకేతాలు.. రాష్ట్రానికి రాలేదు. కానీ చెప్పకుండా చేయడం అనేది.. మంచిది కాదన్న ఉద్దేశంతోనే.. జగన్ వెళ్లి ఓ మాట చెప్పారంటున్నారు.

ఇప్పటి వరకూ .. కేంద్రం కూడా.. మీడియాలో చూసే.. మూడు రాజధానుల గురించి తెలుసుకున్నామని.. అధికారికంగా స్పందించడానికి ప్రాతిపదిక లేదని.. పార్లమెంట్‌లో కూడా చెబుతూ వస్తోది. ఈ క్రమంలో మొదటి సారి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి, హోంమంత్రికి ఇచ్చిన విజ్ఞాపన పత్రాల్లో మూడు రాజధానుల గురించి వివరించారు. సహకరించాలని కోరారు. దీనిపై కేంద్రానికి ఏమైనా ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటే.. దానికి సంబంధించిన రియాక్షన్.. వీలైనంత త్వరగా వచ్చే అవకాశం ఉంది..లేదంటే.. మౌనం అర్థాంగీకారంగా భావించి.. జగన్మోహన్ రెడ్డి తరలింపు ప్రక్రియను మరింత దూకుడుగా కొనసాగించే అవకాశం ఉందంటున్నారు.

అయితే..ఆర్డినెన్స్ తెచ్చినా ఇప్పటికిప్పుడు.. తరలింపు సాధ్యం కాదన్న భావనకు ప్రభుత్వం వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలు తప్పక నిర్వహించాల్సిన పరిస్థితిలో ఉంది. వీటిని మార్చి పదిహేనులోపు పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైతే.. అధికారులకు తీరిక ఉండదు. తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి… బడ్జెట్ సమావేశాలు నెలరోజులపాటు జరుగుతాయి. ఈ సమయంలో ప్రభుత్వ శాఖలన్నీ అసెంబ్లీ సమావేశాలకు అందుబాటులో ఉండాలి. అంటే.. ఏప్రిల్ నెలాఖరు వరకూ తరలిపు సాధ్యం కాదు. అందుకే అంత హడావుడి అవసరం లేదని ప్రభుత్వం తీరిగ్గా భావిస్తున్నట్లుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close