ఆ చర్చను జగన్ ప్రజల్లో పెట్టలేకపోయారా..?

మేనిఫెస్టో వచ్చేసింది, ఎన్నికలకు మూడురోజులే గడువుంది, ఎన్నికల ప్రచారపర్వం కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈ దశలో, ఏ రాజకీయ పార్టీ ప్రచారమైనా ఎలా ఉండాలి..? తాము అనుకున్నవి ప్రజలకు వివరించేశామనీ, తామే అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో అనే స్పష్టమైన అవగాహనను ప్రజలకు ఇచ్చేశామన్నట్టుగా ఉండాలి. కానీ, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి… ఇంకా చర్చించాల్సింది ఏదో మిగిలిపోయిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆదివారం నాడు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో జగన్ ప్రచారం చేశారు.

మోసపూరితమైన మేనిఫెస్టో తయారు చేసుకుని, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. టీడీపీ పాలన మీద చర్చ జరగకుండా రోజుకో అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చి, ప్రజలను డైవర్ట్ చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు పాలనపై చర్చ జరిగితే తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావని జగన్ వ్యాఖ్యానించారు. పోలవరం పూర్తి కాలేదనీ, రైతు రుణమాఫీ జరగలేదనీ, డ్వాక్రా మహిళలకు న్యాయం చెయ్యలేకపోయారనీ… ఇలా రొటీన్ గా ఎప్పుడూ చేసే విమర్శలు యథావిధిగా చేశారు.

టీడీపీ పాలన మీద చర్చ జరిగితే, ఆ పార్టీకి డిపాజిట్లు రావని జగన్ ఇప్పుడు చెబుతుంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఇన్నాళ్లూ ఆ చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్షంగా విఫలమయ్యామని ఆయనే ఒప్పుకుంటూ ఉన్నట్టేనా? ఇన్నాళ్లూ తాను చేస్తున్న విమర్శలు ప్రజల్లో ఎలాంటి చర్చకూ ఉపయోగపడలేదని చెప్తున్నట్టా..? ‘చర్చ జరిగితే’ అని ఇప్పుడు చెప్తుంటే.. ఆ చర్చకు సమయం ఎక్కడుంది? ఈ రకంగా జగన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తోందంటే… ప్రతిపక్ష పార్టీగా వారి బాధ్యతను గడచిన ఐదేళ్లూ సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లనే. అసెంబ్లీకి వెళ్లి, ప్రభుత్వం తీరుపై అక్కడే చర్చించి ఉంటే… ఇంకా చర్చ జరగాలన్న అభిప్రాయం వారికి కూడా ఉండేది కాదు కదా. సమస్యలను ప్రజల్లోనే చర్చిస్తామంటూ అసెంబ్లీకి వైకాపా ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టేసి మరీ పర్యటించారు. అంటే, పాదయాత్రలో ఆ చర్చను ప్రజల్లో పెట్టడంలో వైఫల్యం చెందినట్టే కదా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close