జగన్‌కు ఐదేళ్లూ పాలించే దమ్ము లేదంటున్న చంద్రబాబు

జగన్మోహన్ రెడ్డి ముందస్తుకు వెళ్లడం ఖాయమని అనుకుంటున్న చంద్రబాబు… పొత్తుల విషయంలో వైసీపీ చేస్తున్న తరహాలో సవాళ్లు చేయడం ప్రారంభించారు. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని.. పొత్తు లేనిదే గెలవలేరని వైసీపీ నేతలు చంద్రబాబును విమర్శిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు అదే తరహాలో జగన్‌కు ఐదేళ్లూ పరిపాలించే దమ్ము లేదని అంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన కడప జిల్లాలో భారీగా ప్రజాదరణ లభించడంతో పొంగిపోయారు. జగన్ పాలనా తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని గుర్తించి.. మరింత ఘాటు విమర్శలు చేస్తున్నారు.

ఎంత ఆలస్యమైతే అంత వ్యతిరేకత పెరుగుతుందన్న ఉద్దేశంతో ముందస్తుకు వెళ్లేందుకు జగన్ సిద్దమవుతున్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు వారి నిర్ణయంపై విమర్శలు చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు క్లిష్టంగా మారడంతో ముందస్తుకు వెళ్లడమే బెటరని జగన్ అనుకుంటున్నారని చెబుతున్నారు. అందుకే ఎన్నికల తరహాలో పార్టీ కార్యక్రమాలను పెంచారు. దీంతో టీడీపీ అధినేత కూడా ముందస్తు ఖాయమని నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఆయన ఐదేళ్లూ పరిపాలింటే సత్తా లేదని ప్రకటనలు చేయడం ఆసక్తి రేపుతోంది.

ముందస్తుపై గతంలోలా వైసీపీ నేతలు రూల్ అవుట్ చేయడం లేదు. ఎప్పుడు ఎన్నికలకు వెళ్లాలన్నది తమ ఇష్టమని చంద్రబాబు చెప్పేదేంటి అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ముందస్తు కన్ఫర్మ్ అని విమర్శలు చేస్తున్నారు. ఏపీలో ఈ ముందస్తు రాజకీయం మరింత జోరుగా సాగే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close