చైతన్య : జగన్‌లో స్పష్టంగా ఓటమి భయం !

అప్పట్ల ో వెంట్రుక కూడ పీకలేరని సవాల్ చేసిన సీఎం జగన్ డైలాగుల్లో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పొత్తులనేవి రాజకీయ వ్యూహాల్లో భాగం. పొత్తులు పెట్టుకోవద్దని ఇతర పార్టీల్ని సవాల్ చేయడం అంటే… తమ ఓటమిని తాము ఒప్పుకోవడమే. కేంద్రంలో మోదీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ కూటమిని ఏర్పాటు చేసుకుంది. కానీ బీజేపీ ఎప్పుడూ ఒంటరిగా రావాలని కాంగ్రెస్ పార్టీని సవాల్ చేయలేదు. కూటమిగా పోటీ చేయడం వల్ల.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవు. మనది మెజార్టీ ప్రజాస్వామ్యం. మొత్తం వంద ఓట్లు ఉంటే.. యాభై ఒక్క ఓట్లు తెచ్చుకున్న వారికే గెలుపు రాదు. ఐదుగురు పోటీలో ఉండి.. ముగ్గురిరికి ఇరవై, ఒకరికి 19, మరొకరికి21 వస్తే .. 21 వచ్చిన వారిదే విజయం. మిగతా 79శాతం మంది వ్యతిరేకంగా ఉన్నారు కదా అనే లాజిక్ మన ప్రజాస్వామ్యంలో పని చేయదు. . అందుకే పొత్తులు పెట్టుకుంటాయి. ఓట్లు చీలిపోవడం ద్వారా గెలుస్తామని సీఎం అనుకోవడం వల్లనే ఇలా సవాల్ చేస్తున్నారని సహజంగానే చర్చ ప్రారంభమయింది.

కలిసి పోటీ చేయవద్దని చెప్పడం బేలతనమే !

మొదటి సారి చంద్రబాబు, పవన్ విజయవాడలోని ఓ హోటల్‌లో కలిసినప్పుడు ఎంత మంది కలిసి వచ్చినా సరే వార్ వన్ సైడే అని.. వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రకటించారు. టీడీపీ, జనసేన అసలు విడిపోలేదని మొదటి నుంచి కలిసే ఉన్నాయన్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వైసీపీ నేతలు కూడా ఓ క్లారిటీకి వచ్చారు. దీంతో రెండు పార్టీలను కలిపే విమర్శించడం ప్రారంభించారు. దీంతో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నదాన్ని వైఎస్ఆర్‌సీపీ పట్టించుకోవడం లేదని.. తమ ఓటు బ్యాంక్ తమకు ఉంటుందన్న ధైర్యంతో ఉందని అనుకుంటూ వచ్చారు.

పవన్ ను ఒంటరిగా పోటీ చేయించేందుకు ఎన్ని కుట్రలో !

అయితే అనూహ్యంగా ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలనే సవాల్ చేస్తూ వస్తున్నారు. టీడీపీతో కలిస్తే చంద్రబాబు సీఎం అవుతారని పవన్ సీఎం అవుతారా అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ టీడీపీతో కలుస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిస్తే సీఎం ఎవరు అనే చర్చ కూడా పెట్టారు. . రెండు పార్టీలు ఇంకా అధికారికంగా ఎలాంటి పొత్తుల చర్చలు కూడా ప్రారంభించలేదు. జనసేన పార్టీ ఇప్పటికీ బీజేపీతో పొత్తులో ఉన్నామని చెబుతోంది. అయితే జరుగుతున్న పరిణామాలు మాత్రం.. ఆ పార్టీ టీడీపీ వైపు మొగ్గు చూపుతోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. వైసీపీ నేతలూ నమ్ముతున్నారు. అందుకే ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు.

జగన్‌లో స్పష్టంగా కనిపిస్తున్న ఓటమి భయం !

అధికారంలోకి వచ్చి.. ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిన సీఎం జగన్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. అరాచక రాజ్యం స్థాపించారు. అభివృద్ధి అనే పదం లేకుండా చేశారు. ప్రజల జీవన ప్రమాణాల్ని దారుణంగా తగ్గించేశారు. ఇప్పుడు తాను పంచిన డబ్బులు తీసుకున్న వారు ఓట్లేస్తారన్న ఆశతో దింపుడు కళ్లెం సవాళ్లు చేస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీ కలిస్తే గెలుపు కష్టమని నివేదికలు రావడం ద్వారానే జగన్ ఇలా సవాళ్లు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఇది నిజం కూడా !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close