సాక్షిలో పని చేసే జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో జగన్ రెడ్డి ఆనందపడ్డారో.. ఆవేశపడ్డారో కానీ..రెండు ట్వీట్లు.. తెలుగు, ఇంగ్లిష్లో చేశారు. న్యాయం గెలిచిందన్నారు. చంద్రబాబుకు షాక్ అన్నారు. ఆయన ట్వీట్లు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు.. వైసీపీ నేతల అవినీతి, అక్రమాల కేసుల్లో బెయిల్స్, ముందస్తు బెయిల్స్ కోసం చాలా సార్లు సుప్రీంకోర్టుకు వచ్చి మొట్టికాయలు తిన్నారు. అంత ఎందుకు లిక్కర్ స్కామ్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మరి ఈ తీర్పులపై జగన్ విధానమేంటి?
కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి తప్పు చేశారో ప్రజలు ఓ అంచనాకు వచ్చారు. జగన్ రెడ్డి తన మీడియా చానళ్లలో కూర్చోబెట్టి ప్రజల్ని, మహిళల్ని బూతులు తిట్టించరని.. వాళ్లకు వాళ్లే ఆవేశపడతారని ప్రజలు అనుకోరు. ఎందుకంటే ఎవరి మానసికస్థితి ఏమిటో.. ఎవరి సూచనలో ఎవరు ఎలామాట్లాడతారో ప్రజలకు ఓ క్లారిటీ ఉంది. కొమ్మినేనికి కిందికోర్టులోనే బెయిల్ వచ్చేది కానీ..వాదించడం చేత కాక జడ్జిలను.. ఇతర న్యాయవాదుల్ని బెదిరించే లాయర్ పొన్నవోలను పంపడం ద్వారా ఆయనకు కిందికోర్టులో బెయిల్ రాలేదని న్యాయవాదులందరికీ తెలుసు.
అమరావతి మహిళల్ని వేశ్యలని నిందిస్తున్నప్పుడు వికారంగా నవ్వి.. తన మానసిక ఆనందం..తన యజమాని మానసిక ఆనందాన్ని గుర్తు చేసుకున్న ఈ పెద్ద మనిషి .. చట్ట ప్రకారం బయటపడవచ్చు కానీ.. ప్రజల ఛీత్కారాల నుంచి తప్పించుకోలేరుగా. ఆ కృష్ణంరాజుతో తమకు సంబంధం లేదని చెప్పి జగన్ రెడ్డి తప్పించుకోవచ్చు కానీ.. అలాంటి ఎంత మందిని జైలు పాలు చేశారో ఆయనకు తెలుసు.. ఎన్నికుటుంబాలను నాశనం చేశారో ఆయనకు తెలుసు.
కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చినప్పుడు పొగిడి.. వ్యతిరేకంగా వచ్చినప్పుడు మేనేజ్ చేశారని విమర్శించే ఇలాంటి రాజకీయ నేతలు వ్యవస్థకు పెను ముప్పులాంటి వారని వచ్చే విమర్శలకు అర్థం ఉంటుంది.