జగన్ పై ఈడి కేసు కూడా సిబీఐ కోర్టుకే బదిలీ!

జగన్మోహన్ రెడ్డి తదితరులపై సిబీఐ కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఈడి కూడా సిబీఐ దాఖలు చేసిన ఒక చార్జ్ షీట్ ఆధారంగానే జగన్, జగతి పబ్లికేషన్స్, విజయ సాయిరెడ్డిలపై మరొక కేసులు నమోదు చేసి సమాంతరంగా విచారణ మొదలుపెట్టడానికి సిద్దమయింది. దానిని వారు హైకోర్టులో సవాలు చేసారు. తమపై ఈడి నమోదు చేసిన ఆ కేసులని కూడా సిబీఐ కోర్టుకే బదిలీ చేయాలని వారు హైకోర్టుని కోరగా అందుకు ఈడి కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో, జస్టిస్ రాజా ఇళాంగో ఆ కేసులను కూడా సిబీఐ కోర్టుకి బదిలీ చేశారు. జగన్ తదితరులపై ఈడి నమోదు చేసిన కేసులను వేరేగా విచారణ చేపట్టాలని సిబీఐ కోర్టుని ఆదేశించవలసిందని ఈడి చేసిన అభ్యర్ధనను న్యాయమూర్తి తిరస్కరించారు.

జగన్ అక్రమాస్తుల కేసులలో నిందితులు ఒకరొకరుగా బయటపడటం, ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక ఐ.ఏ.ఎస్. అధికారిని విచారించేందుకు కేంద్రం అనుమతి నిరాకరించడం, ప్రతీ శుక్రవారం తప్పనిసరిగా కోర్టుకి హాజరు కావాలనే బెయిల్ షరతుపై జగన్ కి మినహాయింపునివ్వడం, ఇప్పుడు ఈడి కేసులను కూడా సిబీఐకి బదిలీ చేయడం వంటివన్నీ పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారుతున్నట్లు సూచిస్తున్నాయి. చివరికి అవి ఏ రాజకీయ పరిణామాలకి దారి తీయబోతున్నాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పుల కన్నా “రీ పే” ఎక్కువ !

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు భారీగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తాము తెచ్చిన అప్పుల కన్నా చెల్లించేది ఎక్కువని లెక్కలు విడుదల చేసింది. కేసీఆర్...

వైసీపీలో బొత్స వర్సెస్ విజయసాయి..!?

దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ వాల్తేరు క్లబ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కొత్త వివాదానికి తెరలేపాయి.2014లో వైఎస్ విజయమ్మ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ...

కవిత కోసం బీజేపీకి కేసీఆర్ సరెండర్ అయ్యారా..?

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రధాని మోడీతో కుమ్మక్కయ్యారా..? అందులో భాగంగానే ఐదు లోక్ సభ స్థానాల్లో బీజేపీకి సహకరించేందుకు కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారా..? రాష్ట్రంలో రేవంత్...

డబ్బుతో కొడుతున్నారు : లాజిక్ మిస్సవుతున్న వైసీపీ !

డబ్బుతో ఏమైనా చేయవచ్చా ?. ఏమీ చేయలేరని చాలా ఘటనలులు నిరూపించాయి. చివరికి ఎన్నికల్లో కూడా గెలవలేరని.. డబ్బులు విచ్చలవిడిగా పంచినా.. బీఆర్ఎస్ ఓటమి నిరూపించింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close