వైసీపీ అధినేత జగన రెడ్డి తుపాను వెళ్లిపోయిన వారానికి పొలాల్లో బురద కూడా పూర్తిగా ఆరిపోయిన రైతులను పరామర్శిస్తానంటూ ఊరేగింపుగా చేసిన యాత్ర పూర్తి స్థాయిలో నవ్వుల పాలయింది. ఎప్పట్లాగే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా జనసమీకరణ చేశారు.ఈ ర్యాలీ కారణంగా పలువురు గాయపడ్డారు కూడా. రైతులను పరామర్శించే పేరుతో ఆయన చేసిన డ్రామాలు ఎవర్నీ ఆశ్చర్యపరచలేదు కానీ..ఆయన చెప్పిన మాటలు మాత్రం నవ్వుల పాలయ్యాయి.
ఒక్కటంటే ఒక్క నిజం కూడా చెప్పలేదు. తమ హయాంలో పంటల బీమా గురించి ఆయన చెప్పినన్నీ అబద్దాలే. మూడేళ్ల పాటు ఆయన ప్రభుత్వం పంటల బీమానే కట్టలేదని స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పారు. ఎన్ని విపత్తులు వచ్చినా ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని చెబుతారు కానీ.. చివరికి వెయ్యి రూపాయలు కూడా ఉండదు. వాలంటీర్ల సాయంతో రైతుల కానివాళ్లు,నష్టపోని వైసీపీ నేతలే ఎక్కువగా ఆ పరిహారాన్ని దిగమింగేవారు.
ఇక పంటలకు మద్దతు ధర కోసం స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకున్నామని జగన్ చెప్పడం రైతుల్ని కూడా ఆశ్చర్యపరిచింది. అలాంటి నిధి కానీ..రైతుల్ని ఆదుకున్న చరిత్ర కానీ ఎవరికీ గుర్తు లేదు. టీడీపీ ఇప్పటికే మామిడి, ఉల్లి రైతుల కోసం 800 కోట్లు చెల్లించింది. తమ హయాంలో రైతులకు భరోసా ఉండేదని ఆయనకు ఆనే చెప్పుకున్నారు. కానీ అంతటి భరోసా ఇస్తే … రైతులు ఎందుకు పాతాళంలోకి తొక్కేశారో ఆయన గుర్తు చేసుకోలేకపోతున్నారు. ఈ క్రాప్ విషయంలోనూ అబద్దం చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే 97 ఈక్రాప్ నమోదు పూర్తయింది.
తన ఊహాలోకంలో ఉంటూ..తాను చెప్పేది అందరూ నమ్ముతారనుకునే మనస్తత్వం ఉన్న జగన్..వాస్తవ పరిస్థితుల్ని అర్తం చేసుకోలేకపోతున్నారన్న విమర్శలు ఈ పర్యటన ద్వారా ఎదుర్కోవాల్సి వచ్చింది.
