తన పుట్టినరోజుకి కొత్త నిర్ణయం తీసుకోనున్న జగపతిబాబు!

మరపురాని చిత్రాల నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్‌ తనయుడైన జగపతిబాబు హీరోగా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా తన చిత్రాల ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవల ‘శ్రీమంతుడు’ చిత్రంలో మహేష్‌ తండ్రిగా, నిన్న లెజెండ్ లేటెస్ట్‌గా ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో ఒక డిగ్నిఫైడ్‌ విలన్‌గా, చక్కని నటనను ప్రదర్శించిన జగపతిబాబు ఇప్పుడు మరో అవతారంలో కనిపించబోతున్నాడు.

జగపతి పిక్చర్స్‌ బేనర్‌ను జగపతిబాబు పేరుతో స్టార్ట్‌ చేసి ఎన్నో సూపర్‌ డూపర్‌హిట్‌ సినిమాలను నిర్మించారు వి.బి.రాజేంద్రప్రసాద్‌. చాలా కాలం క్రితమే ఈ బేనర్‌లో చిత్ర నిర్మాణాన్ని ఆపేశారు. ఇప్పుడు తండ్రి తర్వాత జగపతిబాబు నిర్మాతగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. క్లిక్‌ సినీ కార్డ్‌ మీడియా ప్రై. లిమిటెడ్‌ పేరుతో ఓ చిత్ర నిర్మాణ సంస్థని ప్రారంభిస్తున్నాడు. ఈ బేనర్‌లో సంవత్సరానికి నాలుగు సినిమాలను నిర్మించాలని ప్లాన్‌ చేసుకుంటున్నాడు. నూతన నటీనటులకు, కొత్త దర్శకులకు, కొత్త టెక్నీషియన్స్‌కి తన బేనర్‌లో అవకాశాలు ఇచ్చి మంచి సినిమాలు నిర్మించాలన్నది జగపతిబాబు ఆలోచన. అతని పుట్టినరోజు ఫిబ్రవరి 12. ఆ రోజున తను స్టార్ట్‌ చేస్తున్న ప్రొడక్షన్‌ హౌస్‌ గురించి, నిర్మాతగా తన ఎంట్రీ గురించి జగపతిబాబు ప్రకటిస్తారని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close