“కడియం”ను టీడీపీకి ఇచ్చేసిన జనసేన !

రెండు రోజుల కిందట కడియం నుంచి వచ్చిన ఎంపీటీసీలతో పవన్ కల్యాణ్ సమావేశమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర హెచ్చరిక చేశారు. తమ పార్టీ ఎంపీటీసీలను లాక్కుంటే ఊరుకునేది లేదని స్వయంగా వచ్చి పోరాడతానని.. అలాంటి పరిస్థితి తెచ్చుకోవాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అయితే ఈ రోజు కడియం మండలంలో వైసీపీ అభ్యర్థి మండల పరిషత్ చైర్మన్‌గా గెలవలేదు. అలాగని జనసేన ఎంపీటీసీ కూడా చైర్మన్ అవలేదు. తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ మండల పరిషత్ చైర్మన్ అయ్యారు.

కడియం ఎంపీపీగా టీడీపీ అభ్యర్థి సత్యప్రసాద్ ఎన్నికయినట్లుగా అధికారులు ప్రకటించారు. కడియం మండలంలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా తొమ్మిది చోట్ల గెలిచింది. కానీ ఎంపీపీ చైర్మన్ గిరీ కావాలంటే పదకొండు ఎంపీటీసీలు ఉండాల్సిందే. రెండు స్థానాలు తగ్గాయి. అందుకే జనసేన ఎంపీటీసీలపై కన్నేశారు. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. అదే సమయంలో జనసేన ఎనిమిది మంది ఎంపీటీసీలను గెలిచింది. తెలుగుదేశం పార్టీ ఖాతాలో నాలుగు ఉన్నాయి. వీరిద్దరూ కలిస్తే పన్నెండు. ఎంపీపీ చైర్మన్ పదవి ఖాయం అవుతుంది.

అలాగే టీడీపీ, జనసేన కలిసి కడియంను గెల్చుకున్నాయి. అయితే అత్యధిక స్థానాలు ఉన్న జనసేనకు కాకుండా టీడీపీకే పరిషత్ చైర్మన్ పీఠాన్ని జనసేన ఇచ్చేసింది. దీనికి కారణం ఉంది. ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేన కలిసే పోటీ చేశాయి. జడ్పిటీసీ స్థానంలో జనసేన అభ్యర్థి నిలబడ్డారు. మండల పరిషత్ పీఠం టీడీపీకి అని అనుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం పోటీ చేస్తే జడ్పీటీసీ అభ్యర్థి కూడా గెలిచారు. జనసేనకు వచ్చిన రెండు జడ్పీటీసీల్లో ఒకటి కడియం. ఒప్పందం ప్రకారం కడియం మండల పరిషత్ టీడీపీకే ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close