అకాల వర్షాలతో పంట కోల్పోయిన రైతులు ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోతూండటంపై మండిపడుతున్నారు. వారికి అండగా ఉండేందుకు పవన్ కల్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ గోదావరి జిల్లాల్లో అకాల వర్షంతో దెబ్బతిన్న రైతును పరామర్శించనున్నారు. కడియంలో అకాల వర్షాలతో పాడైపోయిన పంటలు, మొలకెత్తిన ధాన్యాన్ని పరిసీలిస్తారు. కొత్తపేట అవిడి గ్రామంలో వరి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. పి.గన్నవరం మండలం..రాజులపాలం గ్రామంలో మొక్కజొన్న…రైతులు మాట్లాడి భరోసా ఇస్తారు..
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఓజీ సినిమా షూటింగ్లో ఉన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే అకాల వర్షాల కారణంగా తూ.గో, ప.గో రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడంతో.. రైతులకు మద్దతుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. చివరి క్షణంలో ఖరారైన పర్యటన అయినప్పటికీ జనసైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కడియం మండంలలో జనసేన పార్టీ విజయం సాధించింది.
తడిచిన ధాన్యం కొనుగోలుకు అధికారులు నిబంధనల పేరుతో జాప్యం చేస్తున్నారు. మొలక వచ్చిందని, రంగు మారిందని, తేమ శాతం అధికంగా ఉందని చెప్తుండడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తామని రైతులు అంటున్నా అధికారుల్లో స్పందన లేదు. తేమ శాతం, నూక, తాలు పేరిట మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ క్వింటాలుకు రూ.150 నుంచి రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ పర్యటించే ప్రాంతాల్లో రాత్రికి రాత్రే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రయత్నించడం వివాదాస్పదమయింది.