చంద్రబాబు దీక్షకు హాజరైన జనసేన

ఇసుకపై చంద్రబాబు దీక్షకు జనసేన పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, మరో నేత శివశంకర్.. చంద్రబాబు దీక్షా శిబిరానికి వచ్చి సంఘిభావం తెలిపారు. కార్మికులను ఆదుకోవాలని ఉద్దేశంతో చంద్రబాబు దీక్ష చేస్తున్నారని.. రాపాక వరప్రసాద్ అభినందించారు. చంద్రబాబు ఉచిత ఇసుక విధానం తెచ్చినప్పుడు.. విమర్శించిన వైసీపీ నేతలు ఇప్పుడేం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 151 సీట్లు గెలిపించిన ప్రజల్ని జగన్‌ రోడ్డున పడేశారుని మండిపడ్డారు. మద్యం పాలసీ వచ్చినప్పుడు ఒక్కరోజు మద్యం దుకాణాలు ఆగలేదు కానీ.. ఇసుక పాలసీకి మాత్రం 4 నెలలుగా ఇసుక ఆగిపోయిందన్నారు. వ్యక్తిగత విమర్శలతో సమస్యను పక్కదారి పట్టిస్తున్నారుని.. అసలు ఉచిత ఇసుకను ఎందుకు రద్దు చేశారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇసుక సమస్యపై జనసేన విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్‌కు… టీడీపీ ఒక్కటే ప్రత్యక్షంగా మద్దతు పలికింది. ఇతర పార్టీలు సంఘిభావం తెలిపాయి కానీ… లాంగ్ మార్చ్‌కు హాజరు కాలేదు. కానీ టీడీపీ మాత్రం అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడిని పంపింది. పైగా ఇసుక సమస్య అందరూ కలిసి పోరాడి.. కార్మికులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ గతంలో పిలుపునిచ్చారు. ఈ కారణంగా చంద్రబాబు దీక్షకు.. జనసేన తరపున ప్రతినిధుల్ని పవన్ కల్యాణ్ పంపించక తప్పలేదని భావిస్తున్నారు.

ఇప్పటికే.. చంద్రబాబు చెప్పినట్లు పవన్ కల్యాణ్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు దీక్షకు… తమ పార్టీ నేతల్ని పంపడం ద్వారా… ఈ విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయినా పవన్ కల్యాణ్ లెక్క చేయలేదు. ఇసుక సమస్య పరిష్కారం కోసం… కార్మికులకు మేలు జరగడం కోసం.. రాజకీయ విమర్శలను సైతం ఎదుర్కోవడానికి సిద్ధమని పవన్ కల్యాణ్.. చంద్రబాబు దీక్షకు ప్రతినిధుల్ని పంపి నిరూపించారని.. జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close