చిరంజీవి భుజాల మీదుగా తుపాకీ కాల్చేలా వైకాపా కుట్ర: జనసేన ప్రతినిధి

సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కరించడం కోసం చిరంజీవి జగన్ నిన్న భేటీ కావడం అటు సినీ పరిశ్రమలోనే కాకుండా ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తిని కలిగించింది. ముఖ్యంగా చిరంజీవి జగన్ లు ఏకాంతంగా భేటీ కావడం పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి భుజాలమీదుగా తుపాకీ పెట్టి చిత్ర పరిశ్రమ వైపు గురి చూసి కాల్చేలా వైకాపా కుట్ర చేస్తోందంటూ స్పందించారు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్. వివరాల్లోకి వెళితే..

చిరంజీవి జగన్ ల భేటీ మీద స్పందిస్తూ జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “ప్రస్తుత రోజుల్లో మంచితనం పనిచేయదు మాస్టారూ??? నిన్న చిరంజీవి గారికి ఒక్కరినే చర్చలకు పిలిచి ఒంటరిగా మాట్లాడడం ఏదైతే ఉందొ.. దాన్ని అవకాశం గా మలుచుకుని, ఎవరైతే సమస్య సృష్టించారో, వారే సమస్యను పరిష్కరిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చుకుని ఎటువంటి కుట్ర చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయంటే – తుపాకీని చిరంజీవి గారి భుజంపై పెట్టి చిత్ర పరిశ్రమకి గురిపెట్టడం, సమస్య పరిష్కారం కాకపోతే దానికి చిరంజీవి గారిని పరిశ్రమ వర్గీయులు బ్లేమ్ చేసేలా చేయడం, మరీ ముఖ్యంగా చిరంజీవి గారు పరిశ్రమ కోసం కాదు తనకి రాజ్యసభ సీటు కోసం చర్చించడానికి వచ్చారని తన అనుకూల మీడియాకి ఫీలర్లు వదలి అల్లరి చేయడం, పెయిడ్ జర్నలిస్టులతో ఆర్టికల్స్ రాయించడం, రాజకీయ పార్టీల వారితో చిరంజీవి గారిపై విమర్శలు చేయించడం, పనిలో పనిగా మెగా కుటుంబంపై బురద జల్లడం, విభజనలు సృష్టించడం…. ఇలా చాలా కుట్రలకి ప్లాన్ చేశారని అంటున్నారు విశ్లేషకులు నిజమేనంటారా ???” అని రాసుకొచ్చారు.

మొత్తం మీద చిరంజీవి జగన్ లు భేటీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మరో రెండు మూడు వారాల్లో తెలియనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close