ఓన్లీ జనసేన ఫర్ ఏపీ రోడ్స్ .. బీజేపీ దూరం దూరం..!

ఏపీలో రోడ్ల పరిస్థితిని మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోల ద్వారా బయట పెట్టాలని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు జనసైనికులకు పవన్ కల్యాణ్ ప్రత్యేక సందేశం విడుదల చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. నెలంతా రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమాలు నిర్వహించి అప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేకపోతే అక్టోబర్ రెంో తేదీ నుంచి తామే శ్రమదానం చేసి రోడ్లను బాగు చేయాలని అనుకుంటున్నారు. స్వయంగా శ్రమదానం చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.

ఈ కార్యక్రమానికి “జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్” అని పేరు పెట్టారు. అయితే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. సొంతంగా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. బీజేపీని భాగస్వామిని చేసుకోవాలని కూడా ఆలోచించలేదు. అలాగే బీజేపీ కూడా ఎలాంటి ఆసక్తి చూపించలేదు. దీంతో రోడ్ల దుస్థితిపై తామే పోరాటం చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకుని దిశానిర్దేశం చేశారు. పొత్తులో భాగంగా రాజకీయంగా చేపట్టే కార్యక్రమాలను సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించుకుని.. కలసికట్టుగా చేయాలని గతంలోనే తీర్మానించుకున్నారు. ఇటీవల మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో ఈ అంశంపై చర్చలు కూడా జరిగాయి. సమన్వయంతో పోరాడాలని వారు ఒకరికొకరు అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

బీజేపీ కేంద్ర నాయకత్వంపై పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో సానుకూలతతో ఉన్నారు. కానీ రాష్ట్ర నాయకత్వం విషయంలో మాత్రం ఆయనకు అభ్యంతరాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వ పెద్దలతో వారు సన్నిహితంగా ఉంటున్నారని.. పెద్దగా పోరాడటం లేదని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన బీజేపీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బీజేపీతో కాకుండా జనసేన ఒంటరిగా నిర్ణయం తీసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close