విజయ్ కాంత్ పై పరువు నష్టం దావా వేసిన జయలలిత

ప్రముఖ తమిళ నటుడు మరియు డిఎండికె పార్టీ అధినేతపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈరోజు పరువు నష్టం దావా వేశారు. రెండు నెలల క్రితం అంటే డిశంబరులో చెన్నైలో వచ్చిన వరదలు కృత్రిమంగా ఏర్పడినవని ఆయన ఆరోపించారు.

ఒక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారం ప్రకారం చెన్నైలో మురుగునీరు సముద్రంలోకి పోయే కాలువాలన్నీ కబ్జాలకు గురవడంతో, అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలు వలన వచ్చిన నీరు బయటకు వెళ్ళే మార్గం లేకపోవడం వలననే నగరం నీళ్ళలో మునిగిపోయిందని పేర్కొంది. నగరంలో ప్రధాన కాలువలు కబ్జాలకు గురవుతున్నాయని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలననే ఈ సమస్య తలెత్తిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. రాజకీయాలలో ఉన్న విజయ్ కాంత్ దాని ఆదరంగానే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలు జయలలిత(ను) అమితంగా ద్వేషించే డిఎంకె పార్టీకి చెందిన మురసోలి అనే పత్రికలో ప్రచిరితం అయ్యేయి. దానిని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి జయలలిత విజయ్ కాంత్ పై పరువు నష్టం దావా వేశారు.

ఆమె తరపున ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.ఎల్. జగన్ చెన్నై ప్రధాన సెషన్స్ కోర్టులో దావా వేశారు. తన క్లయింట్ పై విజయ్ కాంత్ నిరాధారమయిన ఆరోపణలు చేసి ఆమె పరువుకు నష్టం కలిగించారని తన దావాలో పేర్కొన్నారు. ఆ కేసును విచారణకు స్వీకరించిన సెషన్స్ కోర్టు విజయ్ కాంత్ కి నోటీసు జారీ చేసింది.

ఒక సాధారణ విమర్శను పట్టుకొని ముఖ్యమంత్రి జయలలిత విజయ్ కాంత్ పై పరువు నష్టం దావా వేయడం విమర్శలను సహించలేని ఆమె అసహనానికి నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది లేదా త్వరలో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆయనని ఇబ్బంది పెట్టడానికయినా అయ్యుండాలి లేకుంటే రాజకీయాలలో ఇటువంటి విమర్శలు ఎవరూ ఇంత గంభీరంగా తీసుకోరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close