చంద్రబాబు, లోకేష్‌లను అరెస్ట్ చేయాలనేదే జగన్ కోరిక : జేసీ

తన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమార్ అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేయడంపై … జేసీ దివాకర్ రెడ్డి భిన్నంగా స్పందించారు. తమను నడిరోడ్డుపై నిలబెట్టారని.. ఆర్థిక మూలాలను దెబ్బ తీశారని.. వచ్చే నాలుగేళ్లలో ఇంకా చాలా జరుగుతాయని ప్రకటించారు. అలాగని తాము నిరసన కార్యక్రమాలు చేపట్టడం లేదని.. అలా చేయడం పిచ్చి పని అని తేల్చేశారు. తమకు న్యాయస్థానం ఒక్కటే ఇక ఆప్షన్ ఉందన్నారు. చట్టం, న్యాయం ఏమీ లేకుండా… ముఖ్యమంత్రి జగన్ ఎవరిని అరెస్ట్ చేయాలనుకుంటే వారిని అరెస్ట్ చేస్తున్నారని.. కావాలంటే మీరు కోర్టుకు వెళ్లండన్నట్లుగా వ్యవహరిస్తున్నారని.. ఆయనను ఎవరూ అదుపు చేయలేరని తేల్చేశారు.

అన్ని రకాల దేవుళ్లు ఆయనేనని.., సర్వశక్తి సంపన్నుడని.. ఆయనను ఏం చేసినా నాలుగేళ్లు భరించాల్సిందేనని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లను అరెస్ట్ చేయాలని జగన్‌కు ఉందని.. కానీ అలా చేస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందంని.. కేంద్రం జోక్యం చేసుకుంటుందేమో అన్న భయంతో ఆగిపోతున్నారని జేసీ విశ్లేషించారు. తనకు ఎన్ని బస్సులు, లారీలు ఉన్నాయో తెలియదని.. అసలు ఈ వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్న మాట నిజమే కానీ.. ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు. అస్మిత్ రెడ్డి.. మూడేళ్ల కిందట సాక్షి ఆఫీసు ఎదుట ధర్నా చేశారని.. ఆ కక్షతోనే అరెస్ట్ చేశారన్నారు. రేపు తనను అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదన్నారు.

ప్రస్తుతం జగన్ పరిపాలనలో.. అరెస్ట్ కావడానికి నేరం చేయాల్సిన అవసరం లేదని జేసీ విశ్లేషించారు. ఎవరిని అరెస్ట్ చేయాలనుకుంటే వారిని అరెస్ట్ చేస్తున్నారని బ్రిటిష్ పాలనలో దయాదాక్షిణ్యాలు చూపించేవారని.. ఇప్పుడు అవి కూడా లేవని… రాక్షస పాలన అని విమర్శించారు. ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి ఎదిగిన జేసీ దివాకర్ రెడ్డి… నాలుగేళ్ల పాటు ఏం చేస్తారో… చూద్దామని లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాజకీయంగా చేయగలిగిందేమీ లేదని.. కోర్టుల్లో పోరాడటం మాత్రమే మిగిలిదంని ఆయన నమ్ముతున్నట్లుగా ఉన్నారు. ఇంత జరిగుతున్నా.. జగన్ ను ఆయన మావాడు అనే సంబోధిస్తూ మాట్లాడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close