బీజేపీ నేతల్ని ఆపద్భాంధవుల్లా చూస్తున్న జేసీ..!

అనంతపురం నేత జేసీ దివాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అనధికార నేతగా ఫీలైపోతున్నారు. ఆనంతపురం జిల్లాకు ఏ పార్టీ నేత వచ్చినా.. వదిలి పెట్టడం లేదు. వెళ్లి కలిసి వస్తున్నారు. ఆదివారం.. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వస్తే.. వెళ్లి కలిసి కాస్త పరిచయం పెంచుకుని వచ్చిన ఆయన.. ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనంతపురం పర్యటనకు వస్తే.. పోలోమంటూ వెళ్లి కలిసి వచ్చారు. మోడీని వేనోళ్ల పొగిడారు. మరి బీజేపీలో చేరుతారా అంటే.. ఏదో ఓ కారణం ఉండాలి కాబట్టి.. పీవోకేని స్వాధీనం చేసుకుంటే.. చేరిపోతానని చెప్పేస్తున్నారు.

వేధింపులు అంతకంతకూ పెరుగుతున్న దశలో.. జేసీ దివాకర్ రెడ్డి.. కనీసం.. తనకు ఓ రక్షణ చట్రం ఉందని అనిపించుకోవాలన్న ఉద్దేశంతో.. బీజేపీపై పొగడ్తలు ప్రారంభించారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. నిజానికి ఎన్నికలు ముగిసిన తర్వాత మొదట్లోనే.. బీజేపీలో చేరేవారి జాబితాలో జేసీ పేరు వినిపించింది. కొంత మంది తనతో టచ్‌లోకి వచ్చారని కానీ.. తమకు పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. కొంత మంది అనంతపురం నేతలు ఇప్పటికే బీజేపీలో చేరారు. కానీ జేసీ మాత్రం.. టీడీపీలోనే ఉంటానని చెబుతున్నారు.

ఎలా చూసినా.. జేసీ రాజకీయాల నుంచి రిటైరయ్యారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగలేదు. గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు. ఆయనతో పాటు.. ఆయన సోదరుడు కూడా ఎన్నికల బరి నుంచి వైదొలిగి.. కుమారులకు చాన్సిచ్చారు. కానీ అది రివర్స్ అయింది. వారిద్దరూ ఓడిపోయారు. దాంతో.. వారికి రాజకీయ జీవితంలో మొదటి సారి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఓటమితో పాటు.. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడం.. వారిని మరింత ఇబ్బంది పెడుతోంది. వయసులో ఉన్నప్పుడు.. చేసిన రాజకీయాల్లా.. ఇప్పుడు.. జగన్ వేట నుంచి తప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆయన బీజేపీ వైపు చూస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close