అమరావతి ప్రాంతాన్ని వేశ్యా రాజధానిగా ప్రచారం చేస్తూ… కొన్ని వీడియోలు చూపించి మరీ.. తాను అన్నది కరెక్టేనని విశ్లేషణలు చేస్తున్న వేశ్యా స్పెషలిస్ట్ విశ్లేషకుడు కృష్ణంరాజును విశాఖలో పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని ప్రాంత మహిళల్ని ఘోరంగా కించ పరచిన కేసులోఆయనపై కేసులు నమోదయ్యాయి. తన మాటలు వివాదం అయినప్పుడు ఆజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. పలు చోట్ల తిరిగినట్లుగా తెలుస్తోంది. మొదట హైదరాబాద్కు .. ఆ తర్వాత విశాఖకు అక్కడ్నుంచి ఒడిషా పారిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.
అమరావతి మహిళను కించ పరిచిన వ్యవహారంలో నమోదైన కేసుల్లో ఆయన ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. కేసు నమోదు కాగానే పారిపోయారు. ఏ 2గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఇప్పుడు కృష్ణంరాజును అరెస్టు చేశారు. వివాదం అయిన తర్వాత కూడా ఆయన తన వాదనకు ఆధారాలు ఉన్నాయని బ్రోతల్ రెయిడ్స్ వార్తల్ని చూపించారు. ఆయన తీరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా ఉండటంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. జాతీయ మహిళాకమిషన్తో పాటు ఎన్హెచ్ఆర్సీ కూడా కేసులు నమోదు చేసింది.
విశాఖ నుంచి తీసుకు వచ్చిన తుళ్లూరు పోలీసులు ఆయనను మంగళగిరి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. కృష్ణంరాజు అనే వ్యక్తి వైసీపీతో కుమ్మక్కు అయి రాజధాని రైతులపై విపరీత వ్యాఖ్యలు చేయడం ద్వారా.. ఘర్షణలు సృష్టించాలని తద్వారా వచ్చే పెట్టుబడుల్ని.. జరుగుతున్న పనుల్ని ఆపాలన్న కుట్రతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఈ కుట్రలను చేధించనున్నారు.