సీజేఐ రమణ సూచన పాటిస్తే “కృష్ణా” గొడవలకు చెక్..!

తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల వివాదానికి పరిష్కారం ఏమిటి..? ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే మొత్తం సమస్య పరిష్కారం అవుతుదని.. షర్మిల దగ్గర్నుంచి సామాన్యుడి వరకూ చెబుతున్నారు. ఎందుకు మాట్లాడుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా అదే చెబుతున్నారు. సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. తెలంగాణ సర్కార్ తమ హక్కులను కాల రాస్తోందంటూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనమే విచారణ చేపట్టడంతో ఆసక్తి రేకెత్తించింది.

గంట పాటు ఇరు వర్గాల వాదనలను సీజేఐ ధర్మాసనం విన్నది. కృష్ణాబోర్డును నోటిఫై చేసినందున విచారణ అవసరం లేదని తెలంగాణ సర్కార్ వాదించింది. అయితే..గెజిట్ ఇప్పుడే అమల్లోకి రాదని… సెప్టెంబర్‌ తర్వాత వస్తుందని.. ఇప్పటి నుంచే అమలు చేస్తే తమకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని.. అలాగే గతంలో కృష్ణా జలాల వివాదంలో వాదించానని గుర్తు చేసుకున్నారు. బుధవారం మరో ధర్మాసనం ముందుకు విచారణకు వస్తుందన్నారు. చివరికి రెండు రాష్ట్రాల న్యాయవాదులకు మధ్యవర్తిత్వ సూచన చేశారు.

ఎన్వీ రమణ.. వివాదాలను.. కేసులను ఎక్కువగా … వారికి వారే చర్చల ద్వారా లేదా.. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచనలు ఇస్తూంటారు. ఇలా కొన్ని కేసులు పరిష్కరిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల జల వివాదాలకు సంబంధించి సున్నితమైన అంశం కావడం.. అదీ కూడా ఆయన ఏపీకి చెందిన వారు కావడంతో విచారణపై ఉత్కంఠ ఏర్పడింది. ఆయన మధ్యవర్తిత్వ సలహా తెలుగు రాష్ట్రాలు పాటిస్తాయో లేదో కానీ.. సమస్య అయితే సుప్రీంకోర్టు కూడా పరిష్కరించలేదన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close