ఒరెయ్ అనిపించుకోవద్దు – ఒక్క సీటు రానివ్వను – జగన్‌కు కేఏ పాల్ హెచ్చరికలు

రాష్ట్రమంతా తిరుగుతా.. టీడీపీ, బీజేపీకి ఒక్క సీటు రానివ్వను అని లక్ష్మి పార్వతి చేసిన సవాల్ ఇంకా ట్రోలింగ్ లో ఉండగానే..ఆమెకు పోటీగా కేఏ పాల్ కూడా వచ్చేశారు. విశాఖలో జగన్ కు ఇదే తరహా హెచ్చరికలు జారీ చేశారు. తాను తల్చకుంటే.. ఏపీలో జగన్ కు ఒక్క సీటు కూడా రానివ్వనని ప్రకటించారు. ఒరేయ్ జగన్ అని అనిపించుకోవద్దని హెచ్చంచారు. అంతే కాదు.. పవన్ కళ్యాణ్ మాట్లాడితే పొలిటికల్ స్పీచ్ అవుతుందని .. కానీ నేను మాట్లాడితే దైవ శాపమన్నారు. ఇప్పటికే ఏడుగురు పోయారు.. జాగ్రత్త అని కూడా జగన్ ను హెచ్చరించారు.

పాల్ కు ఇంత కోపం ఎందుకు వచ్చిందంటే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ఆమరణదీక్ష చేస్తే..పోలీసులు ఎత్తేశారు. ఇది ఆయనకు కోపం తెప్పించింది. విశాఖలో ప్రెస్ మీట్ పెట్టి జగన్ రెడ్డిని చెడామడా తిట్టేశారు. తనపై దాడికి పాల్పడ్డ సిఐ రామారావు , ఎస్ ఐ ని సస్పెండ్ చేయండి…లేదూ అంటే 24 గంటల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసిపి ఒక్క సీటు కూడా గెలవకుండా చేస్తాను‌.. పులివెందుల్లో కూడా జగన్ గెలవకుండా చేయగలనని హెచ్చరించారు. ఎంపీలందరూ రాజీనామా చేస్తే నెల రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా చూస్తానన్నారు.

కేఏ పాల్ ను ఇప్పటికే ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు కానీ.. ఆయన ఇటీవల జగన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మఖ్యంగా వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి..జగన్ కు అనుకూలంగా మాట్లాడారు. పేపర్ స్టేట్ మెంట్లు ఇచ్చారు. వీడియోలు విడుదల చేశారు. అయితే జగన్ మార్క్ ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో ఆయనకు తెలిసిపోయిందేమో కానీ.. అరేయ్ అనిపించుకోవద్దంటూ మాట్లాడుతున్నారు. లక్ష్మాపార్వితికి పోటీగా కేఏపాల్ రాజకీయాల్లో ఓ వేవ్ సృష్టిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌రో జాతిర‌త్నాలు అవుతుందా?

ఈమ‌ధ్యకాలంలో చిన్న సినిమాలు మ్యాజిక్ చేస్తున్నాయి. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చి, వ‌సూళ్లు కొల్ల‌గొట్టి వెళ్తున్నాయి. `మ్యాడ్‌` టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లూ చూస్తుంటే.. ఇందులోనూ ఏదో విష‌యం ఉంద‌న్న భ‌రోసా క‌లుగుతోంది. సంగీత్‌...

చైతన్య : నిజమే మాస్టారూ – వై ఏపీ నీడ్స్ బటన్ రెడ్డి ?

వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రాకు ఆయన అవసరం ఏంటి అనే చర్చ ప్రజల్లో పెట్టబోతున్నారు. ఇది నెగెటివ్ టోన్ లో ఉంది. అయినా...

ఈ సారి కూడా మోదీకి కేసీఆర్ స్వాగతం చెప్పలేరు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయే...

టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని మర్చిపోతున్న కేటీఆర్ !

కేటీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వరకూ వెళ్లలేదు. అందరితో పాటు తాను కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ... అలా అనుకోవడం లేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close