అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్ పొడిగించింది వెంకటగిరి కోర్టు. మరో 14రోజులపాటు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో కాకాణి ఏ-4 గా ఉన్న సంగతి తెలిసిందే.
వైసీపీ హయాంలో జగన్ రెడ్డి అండ చూసుకొని మంత్రిగా కాకాణి చెలరేగిపోయారు. అక్రమ మైనింగ్ చేపట్టారని ఆయనపై కేసు నమోదు కావడంతో అరెస్ట్ చేస్తారని భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు బెంగళూరులో కాకాణిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో కాకాణి గోవర్ధన్రెడ్డికి నెల్లూరు జల్లా వెంకటగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరు పరచగా, మరోసారి 14రోజుల పాటు రిమాండ్ ను పొడిగించింది న్యాయస్థానం.
మరోవైపు, ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కాకాణి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 11న విచారణ చేపడుతామని పేర్కొంది. ఈ కేసులో ఆయనకు బెయిల్ లభించినా ఇపట్లో విడుదల అయ్యే అవకాశం లేదు. ఎందుకంటేముత్తుకూరు మండల పరిధిలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారిపై అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కంటెయినర్ల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారని ఆయనపై కేసు నమోదు అయింది.