సూర్య‌తో క‌మ‌ల్ సినిమా

రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్స్ సంస్థ పేరుతో క‌మ‌ల్ హాస‌న్ సొంతంగా సినిమాలు తీస్తున్న సంగ‌తి తెలిసిందే. `విక్ర‌మ్` చిత్రానికీ త‌నే నిర్మాత‌. ఈమ‌ధ్య త‌న సినిమాల‌న్నీ రాజ్ క‌మ‌ల్ సంస్థ లోనే తెర‌కెక్కుతున్నాయి. అయితే తొలిసారి మ‌రో హీరోతో క‌మ‌ల్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఆ హీరో ఎవ‌రో కాదు.. సూర్య‌. `విక్ర‌మ్‌`లో సూర్య అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే… సూర్య‌తో ఓ పూర్తి స్థాయి సినిమా చేయాల‌ని క‌మ‌ల్ ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాడ‌ట‌.

”సూర్య‌తో ఓ సినిమా చేయాల‌న్న‌ది నా ప్లాన్‌. త‌న కోసం క‌థ‌లు కూడా విన్నాను. కానీ సెట్ కాలేదు. అయితే త్వ‌ర‌లో త‌ప్ప‌కుండా సూర్య‌తో ఓ సినిమా నా సంస్థ నుంచి ఉంటుంది” అని క‌మ‌ల్ ప్ర‌క‌టించాడు. ‘విక్ర‌మ్లో’ సూర్య ఎంట్రీ గురించి చెబుతూ ”ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉంది. అది సూర్య అయితే బాగుంటంద‌నిపించింది. సాధార‌ణంగా ఇలాంటి ఆబ్లికేష‌న్స్ ని చాలా జాగ్ర‌త్త‌గా హ్యాండిల్ చేయాల్సివ‌స్తుంది. హీరో ఇంటికి వెళ్లి, ఓ బొకే ఇచ్చి.. నాలుగు క‌బుర్లు చెప్పి, అప్పుడు `మా సినిమాలో న‌టిస్తారా` అని అడ‌గాలి. నాకు అంత టైమ్ లేకుండా పోయింది. ఒక్క ఫోన్ చేశాను. అంతే.. సూర్య ఒప్పుకొన్నాడు. `మీరు ఎప్పుడు ర‌మ్మంటే అప్పుడ వ‌స్తా అన్న‌య్యా` అన్నాడు. అంతే.. అంత‌కు మించి మాట‌లు కూడా లేవు.. త‌న‌కి కనీసం బొకే కూడా ఇవ్వ‌లేదు..” అని చెప్పుకొచ్చారు క‌మ‌ల్ హాస‌న్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close