ఓటమి పాలైన కమల్ హాసన్

ప్రముఖ సినీ నటుడు మరియు మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తమిళనాడు అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వివరాల్లోకి వెళితే..

లోకనాయకుడు కమల్ హాసన్ కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. సినీ నటుడిగా అఖండ విజయాలు సాధించారు. ఆ తర్వాత మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించి 2019 లోక్సభ మరియు 2021 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టారు. అయితే లోక్సభ ఎన్నికలలో తాను ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. ఈసారి మాత్రం దక్షిణ కోయంబత్తూరు ప్రాంతం నుండి పోటీకి దిగారు. మొదటి రౌండ్ నుండి సాయంత్రం వరకు స్వల్ప ఆధిక్యతను కనబరుస్తూ వచ్చిన కమల్ హాసన్, సాయంత్రం ఆరు గంటల తర్వాత ఫలితాలు వెలువడిన ప్రతి రౌండ్లోనూ సమీప ప్రత్యర్థి బిజెపి నేత వానతి శ్రీనివాసన్ కంటే వెనుకబడ్డారు.

నిజానికి కమల్ హాసన్ నియోజకవర్గాన్ని ఎంచుకునే విషయంలో కొంత చాణక్యత ప్రదర్శించారు. మొదట్లో చెన్నై పరిసర ప్రాంతంలోని నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని సంకేతాలు పంపారు కమల్ హాసన్. అయితే అధికారికంగా తన నియోజకవర్గాన్ని నిర్ధారణ చేయకుండా డీఎంకే మరియు అన్నాడీఎంకే జాబితా వచ్చేంతవరకు వేచి చూశారు. వారి జాబితాలు విడుదలైన తర్వాత వారి అభ్యర్థుల లిస్ట్ చూసి తన నియోజకవర్గానికి ఖరారు చేసుకున్నారు. దక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గాన్ని అన్నాడిఎంకె కూటమి పొత్తులో భాగంగా బిజెపికి వదిలివేయగా, డి.ఎం.కె కూటమి అదే నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి వదిలివేసింది. దీంతో అటు డీఎంకే అభ్యర్థి కానీ ఇటు అన్నాడీఎంకే అభ్యర్థి కానీ లేనటువంటి దక్షిణ కోయంబత్తూర్ నియోజకవర్గాన్ని తాను పోటీ చేయడానికి ఎంచుకున్నారు కమల్ హాసన్. తమిళనాట బిజెపి కాంగ్రెస్ పార్టీల సొంత బలం నామమాత్రం కావడంతో కమల్ హాసన్ దానిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించారు. అదీ కాకుండా దక్షిణ కోయంబత్తూర్ నియోజకవర్గం సామాజిక సమీకరణాల పరంగా కూడా తనకు కలిసి వస్తుందన్న అంచనా తో కమల్ హాసన్ అక్కడ నుండి పోటీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గం కొంతవరకు అర్బన్ నియోజకవర్గం. దీంతో విద్యావంతులైన ఓటర్లు తన వైపు మొగ్గు చూపుతారని కమల్ భావించారు.

మొత్తానికి తమిళనాడులోని చిన్న నియోజకవర్గాల్లో ఒకటైన దక్షిణ కోయంబత్తూరు లోనూ కమల్ హాసన్ ఎత్తులు ఫలించలేదు. అర్బన్ నియోజకవర్గం అయినప్పటికీ, సామాజిక సమీకరణలు అనుగుణంగా ఉంటాయని భావించినప్పటికీ, కమల్ హాసన్ 1000 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 33 శాతం ఓట్లను కమల్ హాసన్ సాధించగా, బీజేపీ నేత వానతి శ్రీనివాసన్ 34 శాతం ఓట్లతో విజేతగా నిలిచారు. కాంగ్రెస్ నేత జయకుమార్ 28 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కమల్ హాసన్ ఒక్కడే కొంతవరకు పోటీని ఇచ్చినప్పటికీ ఆ పార్టీ తరఫున మిగిలిన అభ్యర్థులు ఎవరూ ఈ మాత్రం పోటీ కూడా ఇవ్వలేకపోయారు‌.

కమల్ హాసన్ పార్టీ తోపాటు విజయకాంత్ పార్టీ కూడా ఈ సారి ఎన్నికల్లో ఎక్కడా పత్తా లేకుండా పోవడం గమనార్హం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close