ఏపీ బీజేపీలో ఢిల్లీ స్థాయి నేత కన్నా ఒక్కరే !

కన్నా లక్ష్మినారాయణకు బీజేపీలో ఎట్టకేలకు గౌరవనీయమైన పదవి దక్కింది. ఏపీ బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పించిన తర్వాత ఆయనకు పెద్దగా పని లేకుండా పోయింది. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇటీవల సోమును తొలగించి మళ్లీ కన్నాకే ఆ పదవి ఇస్తారన్న ప్రచారమూ జరిగింది. అయితే అనూహ్యంగా బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆయనకు చోటు దక్కింది. దేశం మొత్తం మీద 80 మంది సభ్యులు ఉన్న ఆ కమిటీలో బీజేపీకి అత్యున్నతం. అందులో ఏపీ నుంచి ఒక్క కన్నా లక్ష్మినారాయణకు మాత్రమే చోటు దక్కింది. తెలంగాణ నుంచి నలుగురు ఉన్నారు.

ఈ కమిటీలో ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి , రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ, పీయూష్ గోయల్ వంటి ముఖ్య నేతలందరూ ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా యాభై మందిని ప్రకటించారు. ఈ జాబితాలోనూ ఏపీ నుంచి ఎవరూ లేరు. తెలంగాణ నుంచి విజయశాంతి, ఈటల రాజేందర్‌కు అవకాశం కల్పించారు. పార్టీలకు ఉన్న బలాన్ని బట్టి.. బలమైన నేతలను బట్టి ఈ కమిటీలో ప్రాథినిధ్యం కల్పించారు. ఏపీలో చెప్పుకోదగిన బీజేపీ నేత ఎవరూ లేకపోవడంతో కన్నాకు అవకాశం దక్కింది.

మరో వైపు ఈ పదవుల నుంచి తమ పార్టీలో ఉన్న గాంధీలను బీజేపీ దూరం పెట్టింది. మేనకా గాంధీ, వరుణ్ గాంధీలకు పార్టీలో ఎలాంటి పదవులు లేకుండా చేశారు. ఇటీవల రైతులపై కారుతో దూసుకెళ్లిన ఘటన వ్యవహారంలో వరుణ్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది ఆ పార్టీ హైకమాండ్‌కు ఇబ్బందికరంగా మారింది. అందుకే వారిని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close