సుజనాకు ప్రాధాన్యంపై కన్నా అసంతృప్తి..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అనూహ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎంపీలు చేరిన తర్వాత .. ఏపీలో క్షేత్ర స్థాయిలో..ఆ పార్టీలో.. లుకలుకలు ప్రారంభమయ్యాయి. పాత తరం బీజేపీ నేతలు.. ఎక్కడో వెనుకబెంచికి పరిమితవుతూండగా.. మధ్యలో వచ్చిన నేతలు.. ఇప్పటి వరకూ అగ్రతాంబూలం దక్కించుకున్నప్పటికి..ఇప్పుడు ప్రాధాన్యం కోల్పోతున్నారు. కొత్తగా చేరిన నేతలకు అత్యధిక ప్రాధాన్యం దక్కుతూండటంతో.. రెండు వర్గాలు.. అసంతృప్తితో ఉన్నాయి.

కన్నాకు సంబంధం లేకుండా సాగిపోతున్న బీజేపీ వ్యవహారాలు..!

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ ఉండేవారు. ఆయనను పట్టుబట్టి మరీ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు.. అమిత్ షా. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత… కన్నాకు బీపీ రావడంతో.. స్టోరీ చేంజ్ అయింది కానీ.. లేకపోతే.. ఆయన బహుశా.. ఇప్పుడు వైసీపీ కేబినెట్‌లో మంత్రిగా ఉండి ఉండేవారు కావొచ్చు. అయితే.. కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తుందని.. కేంద్ర స్థాయిలో ఏదో ఓ పదవి వస్తుందన్న ఆశతో.. అమిత్ షా చెప్పినట్లు విన్నారు. బీజేపీలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం.. ఆయన పరిస్థితి ఏటూ కాకుండా పోతోంది. ఇప్పుడు.. కన్నాకు.. హైకమాండ్ నుంచి పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. ఆయనకు సంబంధం లేకుండానే.. ఏపీ వ్యవహారాలు.. ఉత్తరాది నేతల చేతుల మీదుగా సాగిపోతున్నాయి.

కన్నా అసంతృప్తి అలా బయట పెట్టారా..?

టీడీపీ ఎంపీల చేరికలపై… కన్నాకు కనీస సమాచారం లేదు. ఎంపీలు మాత్రమే కాదు.. ఆ తర్వాత చాలా మందిని బీజేపీలో చేర్చుకోవడానికి బేరసారాలు ఆడారు కానీ.. వారి గురించి కన్నాతో కనీస చర్చలు కూడా జరపలేదు. పైగా… ఏపీకి వస్తున్న జాతీయ నేతలు.. సుజనా నేతృత్వంలో బీజేపీ బలపడుతుందని ప్రచారం చేస్తున్నారు. దీంతో.. కన్నా లక్ష్మినారాయణ అసంతృప్తికి గురవుతున్నారు. తనను పక్కన పెట్టేస్తున్నారన్న ఫీలింగ్‌తో ఆయన ఉన్నారు. అందుకే… గత ఆదివారం సుజనా చౌదరి.. ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిన ఆయన.. అసలు ఆ కార్యక్రమానికే డుమ్మాకొట్టారు. ఒక్క కన్నా మాత్రమే కాదు.. చాలా మంది నేతలు.. ఆ ఆత్మీయ సమావేశానికి హాజరు కాలేదు.

పాతకాపుల పరిస్థితేమిటి..?

బీజేపీలో చాలా కాలం నుంచి ఉన్న నేతల ఆచూకీ కనిపెట్టడం ఇప్పుడు కష్టంగా ఉంది. సోమువీర్రాజు.. వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. ఆయనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. ఇక విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్లు ఎప్పుడో ఒకసారి కనిపిస్తూంటారు. వారి మాటలు ఆలకించేవారు కూడా లేరు. ఇప్పుడు.. బీజేపీలో అంతా సుజనా హవానే కనిపిస్తోంది. చేరికల విషయంలోనూ ఆయనకే హైకమాండ్ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో ఏపీ బీజేపీలో కొత్త తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close