వైసీపీపై గురి పెట్టిన బీజేపీ – ఏం జరగబోతోంది ?

నెక్ట్స్ ఆపరేషన్ లోటస్ కు బలయ్యేది వైసీపీనే అని చిదంబరం కుమారుడు.. తమిళనాడు ఎంపీ కార్తీ చిదంబరం ఓ ట్వీట్ పెట్టారు. ఆయనకు ఏదో సమాచారం లేకపోతే … ఏపీ రాజకీయాలు.. అదీ వైసీపీ గురించి ట్వీట్ పెట్టాల్సిన అవసరం లేదు. అయితే అదేమిటి అయి ఉంటుందనేది సస్పెన్స్ గా మారింది.

వైసీపీకి నలుగురు లోక్ సభ సభ్యులు ఉన్నారు. పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సమీప భవిష్యత్ లో ఆ పార్టీకి ఒక ఎమ్మెల్సీ లేదా ఓ రాజ్యసభ ఎంపీ సీటు వచ్చే అవకాశాలు లేవు. బీజేపీకి రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది. టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని గతంలో విలీనం చేసుకున్నట్లుగా ఇప్పుడు రాజ్యసభ సభ్యుల్ని విలీనం చేసుకునే ప్రక్రియ ఏమైనా ప్రారంభించారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

వైసీపీ రాజ్యసభ సభ్యులేం పార్టీకి వీర విధేయులు కాదు.. వ్యాపార ప్రముఖులే ఎక్కువ. పరిమళ్ నత్వానీ వైసీపీ, కృష్ణయ్య వంటి వాళ్లు బీజేపీ పిలిస్తే పరుగున వెళ్తారు. బీద మస్తాన్ రావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సహా విజయసాయిరెడ్డి అందరూ లైన్‌లోనే ఉంటారు. ఎందుకంటే… బీజేపీ రావాలంటే.. రాలేమని చెప్పే పరిస్థితి ఉండనంత లగేజీ వీరికి ఉంది.

తమ ఎంపీలంతా వెళ్లి వైసీపీలో చేరినా జగన్ మోహన్ రెడ్డికి నోరెత్తే పరిస్థితి లేదు. ఆయన బలహీనతను ఆసరా చేసుకుని బీజేపీ ఏదో చేయబోతోంది. అదేంటో… ఒకటి, రెండు నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close