దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ ప్రజలకు తీపి కబురు: కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు త్వరలో ఓ తీపి కబురు చెబుతానని ప్రకటించారు. ఈ మాట ఆయన మామూలుగా చెప్పలేదు. దానికో విశేషణం జోడించారు. అదేమిటంటే.. తాను చెప్పబోయే తీపి కబురు దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందన్నారు. కాళేశ్వరంలో భాగంగా సిద్ధిపేట జిల్లాలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ను ప్రారంభించిన తర్వాత కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాటలతో.. ప్రాజెక్ట్ ఓపెనింగ్ గురించి అందరూ మర్చిపోయారు. అసలు కేసీఆర్ దేశ ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా.. తెలంగాణ ప్రజలకు చెప్పబోయే తీపి కబురు ఏమిటనేదానిపై చర్చోపచర్చలు ప్రారంభమయ్యాయి. బహుశా అది కొత్తగా ప్రకటించబోయే పథకమే అయి ఉంటుందని మెజార్టీ అభిప్రాయపడుతున్నారు. రైతు బంధు లాంటి పథకాన్ని ప్రకటించి దేశం మొత్తం.. ఆశ్చర్యపోయేలా చేశారు కేసీఆర్. త్వరలో ఒక్కరైతులకే కాదు..అన్ని వర్గాల ప్రజలకు లాభం కలిగేలా ఏదైనా పథకం ప్రకటిస్తారా.. అన్న చర్చ జోరుగా నడుస్తోంది.

అయితే.. కేసీఆర్ ప్రకటనను.. అందరూ ఒకే యాంగిల్‌లో చూడటం లేదు. సామాన్యులు లాభం కలిగించే పథకం ప్రకటన దిశగా చూస్తున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు.. కేటీఆర్ పట్టాభిషేకం గురించి ఆ ప్రకటన చేసి ఉండొచ్చని చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు.. మొత్తం పథకాలు ఎత్తేసి మరేదో డ్రామా చేయబోతున్నారేమో అని సందేహిస్తున్నారు. అయితే.. కేసీఆర్ చేసే ప్రకటన ఏదైనా కానీ.. లోపల ఏమున్నా… మొదట మాత్రం ప్రజల్ని ఆయన చెప్పినట్లుగానే ఆశ్చర్య పరుస్తుంది. తెలంగాణ ప్రజల్ని సంతృప్తి పరుస్తుంది. ఇలాంటి సమయంలో ఎక్కువగా గుర్తు చేసుకోవాల్సిన మాట ఒకటుంది..

అదేమింటే ఓ సారి అసెంబ్లీలో అక్బరుద్దీన్ చెప్పిన మాట. ఓ రాజుగారి సభలో ఓ విదూషకుడు మాటలుచెప్పి రాజుగార్ని నవ్విస్తాడు. బాగా నవ్వినరాజు.. లక్ష వరహాలు బహుమానం ప్రకటిస్తారు. ఆ విదూషకుడు సంతోషపడతాడు. అయితే ఎంత కాలం అయినా ఆ డబ్బులు అందవు. ఎందుకని ఆరా తీస్తే ఆ రాజుని మాటలు చెప్పి నవ్వించారు… ఆ రాజు కూడా.. మాటలే చెప్పి సంతోషపరిచారు.. చెల్లుకు చెల్లు అన్నారట. అలా అవుతుందేమో కేసీఆర్ ప్రకటన అని చాలామంది సందేహం. అసలు కేసీఆర్.. దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ ప్రజలకు ఏం తీపికబురు చెబుతారో… తెలిసిన తర్వాతే.. ఎవరి అభిప్రాయం నిజమనేది తేలుతుంది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close