ప్రజల్లో మార్పు ఆలోచనలు – అందుకే కేటీఆర్, కేసీఆర్ ఆ విజ్ఞప్తులు !

” అభివృద్ధి చేసేవాళ్లు ఇంకొన్నాళ్లు అధికారంలో ఉంటే తప్పేంటని, బోర్ కొట్టిందని కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటారా” అంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఓ ఎన్నికల సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. మేము బాగా పరిపాలించాం.. మళ్లీ గెలిపిస్తే ఇంకా చేస్తాం ఓడగొట్టుకుంటే నేనేమీ చేయలేను అని కేసీఆర్… నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఈ రెండు కామెంట్లు ఒకే రోజుచేశారు. కాస్త పరిశీలిస్తే దాదాపుగా రోజూ ఇలాంటి కోణంలోనే కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు.

కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి ప్రచార సరళిలో ప్రజల్లో మార్పు కనిపిస్తోందని.. దాన్ని మార్చాలన్న వ్యూహం కనిపిస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయవర్గాల్లో మౌత్ టాక్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మౌత్ టాక్ కాంగ్రెస్ వైపు ఉంది. ఈ సారికి కాంగ్రెస్ అనే నినాదం అంతకంతకూ పెరుగుతున్న సూచనలు కనిపిస్తూండటంతో బీఆర్ఎస్ పెద్దలు అప్రమత్తమయ్యారు. అనవసరంగా రిస్క్ తీసుకుని కాంగ్రెస్ ఓటు వేయవద్దని హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రచార ప్రకటనల్లోనూ రిస్క్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

కాంగ్రెస్ వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికి బీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. దీనికి కారణం ప్రజల్లో కాంగ్రెస్ పై సింపతీ పెరగడం.. ఆ పార్టీకి కూడా ఓ చాన్సివ్వాలన్న ఆలోచన రావడమేనని దీనని బీఆర్ఎస్ అగ్రనేతలు గుర్తించి.. విరుగుడు ప్రకటనలు చేస్తున్నారంటున్నారు. అయితే వారు చేస్తున్న ప్రకటనలు.. .ముందే ఓటమిని అంగీకరించినట్లుగా ఉంటున్నాయని విప్కష నేతలు సెటైర్లు వేస్తున్నారు. అయితే కేసీఆర్ రాజకీయాన్ని ఊహించడం కష్టం. ఆ మాటలు కాస్త వెనుకబడ్డామన్న అభిప్రాయాన్ని కల్పించినా… మేలు చేస్తాయని నమ్ముతున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారం ముగిసింది – 30న అసలు యుద్ధం !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అసలు ప్రచారం ముగిసింది. ఇప్పటి వరకూ ప్రచారంలో ముందు మేమున్నామంటే.. మేమున్నాని చెప్పుకునేందుకు జన సమీకరణ కోసం భారీగా ఖర్చు చేసిన పార్టీలు.. ఇప్పుడు అసలు యుద్ధం ప్రారంభించాయి....

మరో ఇద్దరు ఏపీ ఐఏఎస్‌లకు జైలు శిక్ష – సిగ్గు రాదా ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకాల గురించి గ్రంధాలు రాసినా తరగనంత సాహిత్యం పోగుపడిపోయింది. కోర్టుల దగ్గర ఉన్న ధిక్కార పిటిషన్లను లెక్కేసుకోవడానికి ఐదేళ్లు చాలవు. అతి కష్టం మీద తీర్పు వచ్చినా వాటిని అమలు...

ఏపీ సర్కార్ వారి డేటా ఎనలిటికల్ యూనిట్ – పెద్ద ప్లానే !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా డేటా ఎనలిటికల్ యూనిట్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏం డేటా ఎనలటిక్స్ చేస్తుందంటే... ఆదాయమంట. ఆదాయం ఎక్కడ తగ్గిపోయిందో గుర్తించి పెంచడానికి ఈ యూనిట్...

చంద్రబాబు బెయిల్ రద్దు కాలేదు సరి కదా సర్కార్‌కు సుప్రీం షరతు !

చంద్రబాబు జనాల్లోకి వస్తే తమ పరిస్థితి ఏమి అయిపోతుందోనని కంగారు పడిపోతున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ సుప్రీంకోర్టులోనూ దాని కోసమే ప్రయత్నించారు. చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనకుండా షరతులు విధించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close