మీడియా వాచ్ : ఆర్కేపై కేసీఆర్ మీడియా యుద్ధం !

కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని ప్రకటిచింన తర్వాత … అది అయ్యే పని కాదని రాస్తోంది… కేసీఆర్ రాజకీయ అడుగులు అతిశయోక్తితో కూడుకున్నవని చెబుతోంది… తెలంగాణలో ఆంధ్రజ్యోతి ఒక్కటే. అందులో నిజం ఉందని ఎక్కువ మంది అనుకుంటారు . కానీ తెలంగాణలో ప్రో బీఆర్ఎస్ మీడియాదే హవా. టీవీ చానళ్లు, మీడియా మొత్తం అంతే. అయితే ఆంధ్రజ్యోతి మాత్రమే భిన్నం. ఆ పత్రిక కథనాలతో పాటు ఆర్కే వారాంతంలో రాసే కొత్త పలుకు ఆర్టికల్స్ లోనూ … బీఆర్ఎస్ అయ్యేది పొయ్యేది కాదని చెబుతూంటారు.

ఇంత కాలం చూసిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇక ఆయనపైనా ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఉన్నారు. నమస్తే తెలంగాణ ఒక్క సారిగా ఎడిట్ పేజీలో ఆర్టికల్స్ ప్రచురించడం ప్రారంభించారు. ఎల్లో మీడియా పుల్లారావుల పేరుతో .. సవాల్ రెడ్డి బై లైన్ తో ఎడిట్ పేజీ మొత్తం కేటాయించారు. అయితే అంతటితో అయిపోలేదు.. రేపు కూడా మరో సీరిస్ ఉంటుందని ప్రకటించారు. రాధాకృష్ణకు రాత కృష్ణ అని పేరు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీపై మొదటి నుంచి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆ వ్యాసంలో తీవ్రంగా విరుచుకుపడ్డారు.

సవాల్ రెడ్డి పేరుతో రాస్తున్నది స్వయంగా ఎడిటరేనని.. ఆయన ఆంధ్రజ్యోతి నుంచి వచ్చిన జర్నలిస్టేనన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ కౌంటర్ వల్ల ఆర్కేకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే…. చెప్పడం కష్టమే. ఎందుకంటే… ఆర్కే ఏం రాసినా అది తెలంగాణ వరకే.. కేసీఆర్ పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉంటుంది. సభలకు ఎవరొచ్చారు.. ఎవరు రాలేదన్నది తెలిసిపోతుంది. ఆర్కే రాసే కొత్త పలుకు వల్ల బీఆర్ఎస్‌కు జరిగే
నష్టం ఏమీ ఉండదు.

కానీ తెలంగాణలో వ్యతిరేకంగా రాస్తున్న ఆ ఒక్క పత్రికను కంట్రోల్ చేయాలని బీఆర్ఎస్ చీఫ్ ప్రయత్నిస్తున్నారు. కానీ ఆర్కే ఇలాంటి వాటిని అడ్వాంటేజ్ గా తీసుకుని మరింతగా రాస్తారనే సంగతి .. కేసీఆర్‌కు అందరి కంటే బాగా ఎక్కువ తెలుసని మీడియా సమాజంలో అనుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్, ఆర్కే ఒకప్పుడు ఆప్తమిత్రులు మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close