మీడియా వాచ్ : ఆర్కేపై కేసీఆర్ మీడియా యుద్ధం !

కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని ప్రకటిచింన తర్వాత … అది అయ్యే పని కాదని రాస్తోంది… కేసీఆర్ రాజకీయ అడుగులు అతిశయోక్తితో కూడుకున్నవని చెబుతోంది… తెలంగాణలో ఆంధ్రజ్యోతి ఒక్కటే. అందులో నిజం ఉందని ఎక్కువ మంది అనుకుంటారు . కానీ తెలంగాణలో ప్రో బీఆర్ఎస్ మీడియాదే హవా. టీవీ చానళ్లు, మీడియా మొత్తం అంతే. అయితే ఆంధ్రజ్యోతి మాత్రమే భిన్నం. ఆ పత్రిక కథనాలతో పాటు ఆర్కే వారాంతంలో రాసే కొత్త పలుకు ఆర్టికల్స్ లోనూ … బీఆర్ఎస్ అయ్యేది పొయ్యేది కాదని చెబుతూంటారు.

ఇంత కాలం చూసిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇక ఆయనపైనా ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఉన్నారు. నమస్తే తెలంగాణ ఒక్క సారిగా ఎడిట్ పేజీలో ఆర్టికల్స్ ప్రచురించడం ప్రారంభించారు. ఎల్లో మీడియా పుల్లారావుల పేరుతో .. సవాల్ రెడ్డి బై లైన్ తో ఎడిట్ పేజీ మొత్తం కేటాయించారు. అయితే అంతటితో అయిపోలేదు.. రేపు కూడా మరో సీరిస్ ఉంటుందని ప్రకటించారు. రాధాకృష్ణకు రాత కృష్ణ అని పేరు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీపై మొదటి నుంచి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆ వ్యాసంలో తీవ్రంగా విరుచుకుపడ్డారు.

సవాల్ రెడ్డి పేరుతో రాస్తున్నది స్వయంగా ఎడిటరేనని.. ఆయన ఆంధ్రజ్యోతి నుంచి వచ్చిన జర్నలిస్టేనన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ కౌంటర్ వల్ల ఆర్కేకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే…. చెప్పడం కష్టమే. ఎందుకంటే… ఆర్కే ఏం రాసినా అది తెలంగాణ వరకే.. కేసీఆర్ పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉంటుంది. సభలకు ఎవరొచ్చారు.. ఎవరు రాలేదన్నది తెలిసిపోతుంది. ఆర్కే రాసే కొత్త పలుకు వల్ల బీఆర్ఎస్‌కు జరిగే
నష్టం ఏమీ ఉండదు.

కానీ తెలంగాణలో వ్యతిరేకంగా రాస్తున్న ఆ ఒక్క పత్రికను కంట్రోల్ చేయాలని బీఆర్ఎస్ చీఫ్ ప్రయత్నిస్తున్నారు. కానీ ఆర్కే ఇలాంటి వాటిని అడ్వాంటేజ్ గా తీసుకుని మరింతగా రాస్తారనే సంగతి .. కేసీఆర్‌కు అందరి కంటే బాగా ఎక్కువ తెలుసని మీడియా సమాజంలో అనుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్, ఆర్కే ఒకప్పుడు ఆప్తమిత్రులు మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close