ఢిల్లీ నుంచి కేసీఆర్ దేశవ్యాప్త టూర్స్ – ఇక జాతీయ రాజకీయాలకే ఫిక్స్ !

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. వారం పది రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఢిల్లీలో మేధావులు, మీడియా ప్రతినిధులతో మేథోమథనం జరుపుతారు. ఆ తర్వాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సాయం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఆ మేరకు దాదాపుగా ఐదారు వందల మందికి ఆయన సాయం అందించనున్నారు. ఆప్ ముఖ్య నేతల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన రైతుల జాబితా రెడీ చేశారు. వారికి సాయం అందించేందుకు వివరాలు కూడా తీసుకున్నారు. తర్వాత ఢిల్లీ నుంచేకేసీఆర్ బెంగళూరు పర్యటనకు వెళ్తారని తెలుస్తోంది. కుదిరితే ఇతర రాష్ట్రాల్లోనూ ఆయన పర్యటించే అవకాశం ఉంది. ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాలు చేయాలనుకుంటున్న కేసీఆర్… ఇక ప్రత్యక్ష పర్యటనలు చేయక తప్పదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలించకపోయినా… కలసి రావడానికి ఎవరూ సిద్ధపడకపోయినా ముందుకే వెళ్లాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.

పట్టువదలకుండా ప్రయత్నాలు చేసి.. దేశంలో రాజకీయంగా గుణాత్మక మార్పు తీసుకు రావాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా లండన్ పర్యటనలో ఉన్నారు. ఆ తర్వాత దావోస్ వెళ్తారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉన్న సమయంలో ప్రభుత్వ వ్యవహారాలను చూసుకునే కేటీఆర్ కూడా నగరంలో లేని సమయంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం టీఆర్ఎస్‌లోనూ ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో పరిపాలనా వ్యవహారాలను కేసీఆర్ మొత్తం సెట్ చేసి పెట్టారని.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

కేసీఆర్ జాతీయ రాజకీయ పర్యటనలపై టీఆర్ఎస్ వర్గాలు కూడా నమ్మకంగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం తరహాలో ఓ వేవ్‌ను కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తెస్తారని గట్టినమ్మకంతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close