కేసీఆర్ “కరెంట్ స్వప్నం” కోతలకు చేరిందా ?

దేశంలో కరెంట్ ఉంటే వార్త….తెలంగాణలో కరెంట్ పోతే వార్త. రైతులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. బీఆఎస్ కు అధికారం ఇస్తే.. దేశం మొత్తం ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ అని.. కేసీఆర్ మైక్ పట్టుకున్న ప్రతీ సారి చెబుతూ వస్తూంటారు. విద్యుత్ విషయంలో కేసీఆర్ కు తాము స్వయం సమృద్ధి సాధించామన్న నమ్మకం ఉంది. అయితే ఇలా విద్యుత్ ను ప్లస్ గా చూపిస్తూ… ప్రజల దగ్గరకు వెళ్తున్న సమయంలోనే తెలంగాణలో కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి.

తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడటంతో ఇరవై నాలుగు గంటల విద్యుత్ నిలిపివేశారు. త్రీ ఫేస్ విద్యుత్ ను అసలు వ్యవసాయ మోటార్లకు పంపిణీ చేయడం ఆపేశారు. సింగిల్ ఫేస్ ఇస్తున్నారు. ఇది కూడా నాలుగు గంటలకు మించి ఉండటం లేదు. దీంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణలో అన్ని వైపుల నుంచి ఇలా విద్యుత్ కోసం రోడ్డెక్కిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అర్థరాత్రుళ్లు కూడా ధర్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని విపక్షాలు ఎందుకు వదిలి పెడతాయి ? వారు అసెంబ్లీ వరకూ తీసుకు వచ్చారు.

రైతులకు సరిపడా విద్యుత్ ఇవ్వకపోతే ధర్నాలు చేస్తామని.. రోడ్లను బ్లాక్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కరెంట్ డిమాండ్ పెరుగుతూండటం… బయట నుంచి కొనడం తగ్గించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడే ఇలా ఉంటే.. సమ్మర్ లో మరిన్ని తీవ్రమైన కష్టాలను తెలంగాణ ప్రజలు పడాల్సి ఉంటుందన్న సంకేతాలు అందుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనకాపల్లి లోక్‌సభ రివ్యూ : సీఎం రమేష్ వైసీపీ పరోక్ష సాయం !

అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకం. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ నుంచి కనీసం ముగ్గురు కీలక నేతలు అనుకున్నారు. జనసేన నుంచి నాగబాబు...

క‌న్న‌ప్ప సెట్లో అక్ష‌య్ కుమార్‌

`క‌న్న‌ప్ప‌` కు స్టార్ బ‌లం పెరుగుతూ పోతోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్‌, న‌య‌న‌తార‌.. వీళ్లంతా ఈ ప్రాజెక్ట్ లో భాగం పంచుకొన్నారు. అక్ష‌య్ కుమార్ శివుడిగా న‌టించ‌బోతున్నాడంటూ ప్ర‌చారం...

రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పుల కన్నా “రీ పే” ఎక్కువ !

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు భారీగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తాము తెచ్చిన అప్పుల కన్నా చెల్లించేది ఎక్కువని లెక్కలు విడుదల చేసింది. కేసీఆర్...

వైసీపీలో బొత్స వర్సెస్ విజయసాయి..!?

దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ వాల్తేరు క్లబ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కొత్త వివాదానికి తెరలేపాయి.2014లో వైఎస్ విజయమ్మ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close