ఎమ్మెల్సీ ఎన్నికల భయం.. రూ. 250 కోట్లు రిలీజ్ చేసిన కేసీఆర్!

సొంత పార్టీ క్యాడరే అయినా వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేస్తే.. వారికి పార్టీ.. గీర్టీ ఏమీ ఉండదని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇప్పుడిప్పుడే బోధపడుతున్నట్లుగా ఉంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ అనివార్యం కావడంతో ఇప్పుడు ఆ పార్టీకి చెందిన ఓటర్లు కూడా ఆ పార్టీకి ఓటు వేస్తారా అనే డౌట్ ప్రారంభమయింది. అందుకే ఇతరులే గెలవబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎన్నికలు జరుగుతున్న ఆరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 70 శాతం మంది ఓటర్లు ఉన్నారు. కానీ చివరికి మెదక్ ఓటర్లను కూడా క్యాంపులకు తరలించారు.

దీనికి కారణంగా టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధుల్లోనే చాలా మందికి తీవ్ర అసంతృప్తి ఉంది. దీనికి కారణం వారికి ఆర్థికంగా లాభంచేయకపోవడం కాదు.. ఆర్థికంగా చితికిపోయేలా చేయడం. ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలిచిన వారు పనులు చేపట్టారు. కానీ ఆ బిల్లులు రాలేదు. దీంతో అనేక మంది ఆర్థికంగా చితికిపోయారు.ఇప్పుడు వారంతా తమకు ఓ అవకాశం వచ్చిందని అనుకుంటున్నారు. ఈ ప్రమాదం పసిగట్టిన కేసీఆర్.. ఎన్నికలపై ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల బిల్లులను రూ. 250కోట్లు తక్షణం విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు .

క్యాంపుల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వెలిబుచ్చుతున్న అసంతృప్తిని నేతలు కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే జిల్లా, మండల పరిషత్‌ల అభివృద్ధికి రూ. 250 కోట్లను తక్షణమే విడుదల చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లిని సీఎం ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలు మాటలకే నని ఎన్నికలయ్యే వరకూ అవి విడుదల కావని.. ఆ తర్వాత పట్టించుకోరని.. టీఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే కేసీఆర్ వ్యూహం ఎన్నికల ముందు ఇలాంటి ఆశలు కల్పించడం.. తర్వాత జెల్లకొట్టడమేనని వారికి అవగాహన అయిందని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఒక్క ఎమ్మెల్సీ స్థానం పోయినా కేసీఆర్‌కు మరింత గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close