ఈ సారి గాల్వన్, పుల్వామా అమరవీరులకు చెక్కులు !

తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఇప్పటికే అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయింది. ఈ సారి కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంది. గాల్వన్ లోయ ఘర్షణలో చనిపోయిన వారికి కేసీఆర్ గతంలో పరిహారం ప్రకటించారు. ఇప్పటికే ఏడు కుటుంబాలకు తలా రూ. 10 లక్షలు ఇచ్చారు. ఇంకా 12 మందికి ఇవ్వాల్సి ఉంది. 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌‌పై జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకూ ఆర్థిక సాయం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఈ మేరకు అధికారులు జాబితా రెడీ చేసి కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఈ కుటుంబాలకూ పరిహారం చెక్కులు పంపిణీ చేసే అవకాశం ఉంది. ఎన్నికల సీజన్ ప్రారంభానికి ముందు పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రవాదుల దాడిలో మొత్తం 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఆ సంఘటన రాజకీయంగానూ కలకలం రేపింది. ఈ దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు తలా రూ. 25 లక్షల చొప్పున ప్రభుత్వం తరఫున సాయం అందించనున్నట్లు సీఎం అసెంబ్లీ వేదికగానే హామీ ఇచ్చారు. మూడేళ్ళు దాటినా ఆ సాయం ఇప్పటికీ ఇవ్వలేదు.

అసెంబ్లీలో ప్రకటన చేసిన మేరకు సాయం చేయరా అని అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నందున ఇలాంటి హామీలను బాకీ ఉంచుకోకూడదని.. తక్షణం అమలు చేసేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆ ప్రకారం.. ఈ సారి అమరవీరుల జవాన్ల కుటుంబాలకు పరిహారం పంపిణీ ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close