ప్రజల అసంతృప్తి కారణాలపై కేసీఆర్ ఫోకస్ !

జాతీయ పార్టీ ఆలోచనలను పక్కన పెట్టిన కేసీఆర్ ఇప్పుడు పార్టీపై దృష్టి పెట్టారు. పీకే టీం ఇస్తున్న ఫీడ్ బ్యాక్.. పార్టీ నేతలు చెబుతున్న ఫిర్యాదులు… ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్న ఆరోపణలు ఇలా అన్నింటినీ బేరీజు వేసుకుని ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు నడుం బిగించారు. ఇందు కోసం ” ధరణి”పై తొలి సారి దృష్టి సారించారు. తెలంగాణ సర్కార్ భూ సమస్యల పరిష్కారం కోసం అంటూ ధరణిని తీసుకు వచ్చింది. కానీ ఇది భూ సమస్యలను రెండింతలు చేసింది. దీంతో ప్రతీ గ్రామంలోనూ ఏదో ఓ సమస్య ఏర్పడింది. దీని వల్ల లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు.

ఈ సమస్య గురించి రాజకీయ పార్టీలు కూడా చాలా కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్‌లో ధరణి రద్దు అనేది కూడా ఒకటి. ఈ హామీ చాలా మందిని విశేషంగా ఆకర్షిస్తోందని టీఆర్ఎస్‌కు ఫీడ్ బ్యాక్ అందుతోంది. ఇది కేసీఆర్ మానసపుత్రిక. వ్యతిరేకంగా ఉన్నారని వెంటనే రద్దు చేయలేని పరిస్థితి. అందుకే ఇందులోని సమస్యలను పరిష్కరించాలని ముందుగా నిర్ణయించారు. అధికారులతో కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అసలు సమస్యలేంటి.. ఎక్కడ ఇబ్బందులున్నాయి.. ప్రజల ఇబ్బందులేంటి అనేదానిపై చర్చించారు. పరిష్కారానికి రోడ్ మ్యాప్ రూపొందించారు.

ధరణి విషయంలోనే కాదు ఇతర అంశాల్లోనూ ప్రజల్లో అసంతృప్తి ఉందని.. వాటిపైనా కేసీఆర్ కసరత్తు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశాలు వరుసగా కొన్ని రోజుల పాటు జరుగుతాయి. ప్రజలకు కొత్త పించన్లు, రేషన్ కార్డులు ఇవ్వడం సహా అనేక అంశాలపై కేసీఆర్ నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీని చక్కదిద్దుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తాజా పరిణామాలతో స్పష్టమవుతోందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close