మొక్క బ‌త‌క్క‌పోతే ప‌ద‌వి పోతుంద‌న్న కేటీఆర్!

ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం వెన‌క ఎలాంటి రాజ‌కీయ ఉద్దేశాలు లేవ‌న్నారు మంత్రి కేటీఆర్. ఇది ప‌ట్ట‌ణాల‌ను అభివృద్ధి చేయాల‌న్న ల‌క్ష్యంతో మాత్ర‌మే ప్రారంభించింద‌న్నారు. ఇది ఎన్నిక‌ల స‌మ‌యం కానే కాదు, అన్ని ర‌కాల ఎన్నిక‌లూ పూర్త‌యిపోయాయ‌న్నారు. రాబోయే నాలుగేళ్ల‌పాటు ప్ర‌జ‌ల‌కు సేవ చేసుకుని, వారి మ‌న‌సు దోచుకునే ఉద్దేశంతో చేస్తున్నామ‌న్నారు. గ‌తంలో మున్సిపాలిటీలంటే చెడ్డ పేరు ఉండేద‌నీ, అది పూర్తిగా పోవాల‌న్నారు. బ‌ల్దియా అంటే ఖాయా పీయా చ‌ల్దియా అనే అప‌వాదు ఉంద‌నీ, దాన్ని పూర్తిగా మార్చాల‌నేది ముఖ్య‌మంత్రి కేసీఆర్ ల‌క్ష్యం అన్నారు.

ఈ సంద‌ర్భంగా నాయ‌కుల‌కు మ‌రో హెచ్చ‌రిక కూడా చేశారు మంత్రి కేటీఆర్! ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో భాగంగా మున్సిపాలిటీల‌ వార్డుల్లో మొక్క‌లను పెద్ద సంఖ్య‌లో నాయ‌కులు నాటుతున్నారు. ఇది మంచి విష‌య‌మే. వీటిలో క‌నీసం 85 శాతం మొక్క‌లు బ‌తికి తీరాల‌నీ, ఈరోజు ఆడంబ‌రంగా పాతేసి, ఆ త‌రువాత వాటిని ప‌ట్టించుకోకుండా ఉంటే కుద‌ర‌ద‌న్నారు కేటీఆర్. ఇదీ ఓకే! అయితే, మొక్క‌ల బాధ్య‌త‌లు కౌన్సిల‌ర్లు తీసుకోవాల‌నీ, అవి బ‌త‌క్క‌పోతే కౌన్సిల‌ర్ల ప‌ద‌వులు ఊడ‌గొట్ట‌డం ఖాయ‌మ‌న్నారు కేటీఆర్. భ‌వ‌న నిర్మాణ అనుమ‌తులు మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు ఏప్రిల్ 2 నుంచి టీఎస్ బీపాస్ విధానం అమ‌ల్లోకి తెస్తామ‌ని మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా చెప్పారు.

ప‌ద‌వులు ఊడ‌గొడ‌తా అంటూ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యం నుంచే నాయ‌కుల‌కు కేటీఆర్ వార్నింగులు ఇస్తూ వ‌స్తున్నారు. ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి విజ‌య‌వంతం చేయ‌క‌పోతే ప‌ద‌వులు పీకేస్తామ‌ని గ‌త‌వారంలోనే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు… మొక్క‌లు బ‌త‌క్క‌పోతే ప‌ద‌వులు ఊడ‌గొడ‌తామంటున్నారు. కేటీఆర్ ఒక్క‌రే కాదు… మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర రావు కూడా ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి ప్రారంభానికి ముందు రోజు నాయ‌కుల‌తో మాట్లాడుతూ… స‌రిగా పనిచేయ‌క‌పోతే ప‌ద‌వులు పోతాయి జాగ్ర‌త్త అంటూ మాట్లాడారు! ఒక‌సారి చెప్తే చాల‌దా..? ప‌దేప‌దే ప్ర‌తీ అంశంలోనూ ప‌ద‌వులు పీకేస్తామ‌ని బెదిరించాలా..? మొక్క‌లు పెంచాల్సిన బాధ్య‌త‌ను, అవ‌స‌రాన్ని నాయ‌కుల‌కు తెలిసేలా చేయాలిగానీ… ప్ర‌తీదానికీ ప‌ద‌వులు పీకేసుడేనా తార‌క‌ మంత్రం?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close