కృష్ణానీరు కిందకు రాకుండా ఆపేస్తానని జగన్‌కు కేసీఆర్ హెచ్చరిక..!

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఆపకపోతే కృష్ణానీరు దిగువకురాకుండా బ్యారేజీ నిర్మిస్తామని ఏపీ సర్కార్‌కు కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఏం జరిగిందన్నదానిపై ఆలస్యంగా వివరాలు బయటకు వస్తున్నాయి. అపెక్స్ కమిటీ భేటీలో కేసీఆర్ .. ఏపీ సీఎం తీరుపై ఫైరయినట్లుగా తెలంగాణ ప్రభుత్వ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జలవివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ అపెక్స్ కౌన్సిల్ భేటీని ఏర్పాటు చేశారు. సమావేశలో సమావేశంలో ఏపీ ప్రభుత్వానికి కేసీఆర్‌ ఘాటు హెచ్చరిక చేసినట్లుగా తెలుస్తోంది. కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు లాంటి అక్రమ ప్రాజెక్ట్‌లు ఆపకుంటే.. గోదావరిపై మహారాష్ట్ర బాబ్లీని నిర్మించినట్లే.. కృష్ణానదిపై ఆలంపూర్- పెద్దమరూర్‌ వద్ద బ్యారేజీ నిర్మిస్తామని తేల్చి చెప్పారు. రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ఖాయమని..ఎవరూ ఆపలేని స్పష్టం చేశారు.

నదీజలాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్యాయం చేసినట్టే.. ఇప్పుడూ చేస్తే కుదరదని.. తెలంగాణ నీటివాటాను కొల్లగొట్టాలని చూస్తే.. ఎంతకైనా సిద్ధమని హెచ్చరించారు. అక్రమ ప్రాజెక్ట్‌లను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చినా.. రాయలసీమ లిఫ్ట్‌ను ఏపీ కొనసాగించడం బాధాకరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు కెనాల్‌ను తెలంగాణ ఉద్యమకాలం నుంచే వ్యతిరేకిస్తున్నామని.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా.. పోతిరెడ్డిపాడును మరింత విస్తరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు గడుస్తున్నా.. కేంద్రం నీటి కేటాయింపులు జరపలేదని.. అసంతృప్తి వ్యక్తం చేశారు. బేసిన్ అవతలికి కృష్ణా జలాలను తరలించే వీలు ఏపీకి లేదన్నారు.

తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులేవీ కొత్తవి కావని.. ప్రాజెక్ట్‌ డిజైన్లలో స్వల్ప మార్పులు మాత్రమే చేశామని.. డీపీఆర్‌లు ఇవ్వడానికి అభ్యంతరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్‌లపై అనుమతులపైనా కేసీఆర్‌, జగన్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. కాళేశ్వరంలో మూడో టీఎంసీ ఎత్తిపోతలకు అనుమతులు లేవని జగన్ సమావేశంలో వ్యాఖ్యానించారు. అయితే జగన్ వ్యాఖ్యలపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడుకు అసలు అనుమతులే లేవని స్పష్టం చేశారు. అసలు మొదటి ప్రాజెక్ట్ అయిన పోతిరెడ్డిపాడుకే అనుమతి లేనప్పుడు.. రెండోదిగా రాయలసీమ ఎత్తిపోతల ఎలా చేపడుతారని కేసీఆర్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close