అరవింద్ కేజ్రీవాల్ ని కెలికి కేంద్రం తప్పు చేసిందేమో?

డిల్లీ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంపై సిబిఐ దాడులు చేసినందుకు మోడీ ప్రభుత్వం పశ్చాతాపపడే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీపై డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఎదురుదాడితో మోడీ ప్రభుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది. ముఖ్యంగా ఆయన చేస్తున్న ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ పదేపదే సంజాయిషీలు ఇచ్చుకొంటూనే మళ్ళీ కేజ్రీవాల్ ని ఎదుర్కోవలసి వస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చాల చికాకు కలిగించే అంశమే కానీ అది స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు.

అరుణ్ జైట్లీ ఇదివరకు 13సం.ల పాటు డిల్లీ జిల్లా క్రికెట్ అధ్యక్షుడుగా ఉన్నారు. ఆ సమయంలో డిల్లీలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అసలు కంటే రెట్టింపు ఖర్చయినట్లు లెక్క చూపించి సుమారు రూ.50 కోట్లకు పైగా అవకతవకలకు పాల్పడ్డారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఆ కుంభకోణంపై తమ ప్రభుత్వం విచారణ చేస్తునందున, సిబిఐ అధికారులను తన కార్యాలయంపైకి పంపించి, అందుకు సంబంధించిన ఫైళ్ళ కోసం శోదాలు నిర్వహింపజేసారని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఆ కుంభకోణంతో తనకు సంబంధం లేదని అరుణ్ జైట్లీ భావిస్తున్నట్లయితే, దానిని చూసి ఎందుకు అంతగా భయపడుతున్నారని కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అరుణ్ జైట్లీ మీడియా సమక్షంలో తనపై వచ్చిన తీవ్ర ఆరోపణలు ఖండించినందున ఆయనని నిర్దోషిగా భావించవచ్చనుకొంటే, 2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణంలో నిందితులు కూడా అదే పనిచేస్తే సరిపోతుంది కదా? అని ప్రశ్నించారు.

అరవింద్ కేజ్రీవాల్ కి బిహార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, మమతా బెనర్జీ మద్దతు పలకడంతో అరుణ్ జైట్లీ ఇంకా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కేజ్రీవాల్ ఆరోపణలను మొదట చాలా తేలికగా తీసుకొన్న ఆయన ఇప్పుడు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నారు. మొదట కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని విమర్శించినప్పటికీ, ఇప్పుడు కేంద్రమంత్రులెవరూ కూడా ఈ వాగ్వాదంలో జైట్లీకి అండగా నిలబడకపోవడంతో ఆయనొక్కరే కేజ్రీవాల్ ని, ఆయనకు మద్దతు ఇస్తున్న నితీష్ కుమార్ మరియు మమతా బెనర్జీని కూడా ఎదుర్కోవలసివస్తోంది. సిబిఐ అధికారులు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి తెలియపరచకుండా డిల్లీ సచివాలయంపై దాడులు చేసినందుకే కేంద్రప్రభుత్వం విమర్శలు మూటగట్టుకొంటుంటే, అరుణ్ జైట్లీపై కేజ్రీవాల్ చేస్తున్న ఈ తీవ్ర ఆరోపణల వలన ఇంకా అప్రదిష్ట కలుగుతోంది. బహుశః కేజ్రీవాల్ ని కెలికినందుకు మోడీ ప్రభుత్వం కూడా ఇప్పుడు పశ్చాతాపపడుతోందేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close